నిమ్మరసం కలిపిన చియా సీడ్స్ నీరు.. తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలు.. తెలిస్తే..
ప్రతి ఒక్కరూ శరీరంలో సరైన మెటబాలిజం కోసం తరచూ సరైన మోతాదులో నీళ్లు తాగుతూ ఉండాలి. హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల శరీరం నుంచి వ్యర్థాలు తొలగిపోతాయి. శరీర ఉష్ణోగ్రత బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అయితే, ఇంట్లో మనం రోజూ తాగే నీటికి బదులుగా, అందులో చియా విత్తనాలు, నిమ్మరసం యాడ్ చేసుకోవటం వల్ల నీటి రుచి పెరుగుతుంది. పైగా ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం, చియా విత్తనాలను తాగడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం..
Updated on: Jun 25, 2025 | 8:30 AM

చియా విత్తనాలను నానబెట్టిన తర్వాత తిన్నప్పటికీ తగినంత నీరు త్రాగటం ముఖ్యం. వాటిలో చాలా ఫైబర్ ఉంటుంది. అవి పరిసరాల నుండి, మీ జీర్ణవ్యవస్థ నుండి కూడా నీటిని గ్రహిస్తాయి. కాబట్టి వాటిని తిన్న తర్వాత ఎక్కువ నీరు త్రాగాలి.

నీటిలో నానబెట్టిన చియా విత్తనాలతో పాటుగా నిమ్మరసం కలిపి తీసుకోవటం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. నీటిలో చియా విత్తనాలు, నిమ్మకాయ కలయిక జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎందుకంటే ఇది అధిక ఫైబర్ కంటెంట్, ప్రీబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.

అంతేకాదు... ఈ అద్భుత పానీయంతో రక్తంలో చక్కెర బ్యాలెన్స్ అవుతుంది. చియా విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తాయని, తద్వారా ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర నిర్వహణకు దోహదం చేస్తాయని పలు పరిశోధన అధ్యయనాలు చెబుతున్నాయి.

నిమ్మరసం, చియా సీడ్స్ కలిపి తయారు చేసిన నీరు హార్ట్ హెల్తీ డ్రింక్గా కూడా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చియా విత్తనాలు గుండె ఆరోగ్యానికి మంచిది. వీటిలోని ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అలాగే, నిమ్మరసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చియా సీడ్స్, నిమ్మరసం యాడ్ చేసిన నీటిని తీసుకోవటం వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిమ్మరసంతో చియా విత్తనాలను కలపడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం శక్తివంతంగా కాంతివంతంగా మారుతుంది. ఫలితంగా యవ్వనంగా కనిపిస్తారు.




