గురువు వక్రగమనం వీరికి పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ఉన్న ప్రాధాన్యతే వేరు. ఈ గ్రహం శుభ స్థానంలో ఉంటే కలిగే ఫలితాలు మాటల్లో చెప్పలేం. అయితే గురు గ్రహం త్వరలో వక్రగమనంలో సంచరించనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Sep 14, 2025 | 4:00 PM

గురు గ్రహం దాదాపు ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకోవడమే కాకుండా, వక్రగమనంలో ప్రయాణిస్తుంటాడు. అయితే నవంబర్ 11 నుంచి డిసెంబర్ 4 వరకు గురు గ్రహం కర్కాటక రాశిలో తిరోగమనంలో ప్రయాణిస్తాడు. దీని వలన నాలుగు రాశలు వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కన్యా రాశి : కన్యా రాశి వారికి గురు వక్రగమనం వలన చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశి వారికి అనుకున్న పనులు సకాలంలో కంప్లీట్ చేస్తారు. గురు వక్రగమనం వలన వీరికి శుభ ఫలితాలే కలగనున్నాయి. ఈ రాశి వారు విదేశిప్రయాణాలకు కోసం ఎదురు చూస్తున్న పనులు పూర్తి అవుతాయి. విద్యార్థులకు అద్భుతంగా ఉండబోతుంది.

తుల రాశి : తు రాశి వారికి గురు ప్రభావం వలన ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అప్పులు తీరిపోతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా రానీ బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. అంతే కాకుండా విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా, మంచి కాలేజీల్లో సీటు కూడా పొందుతారు. ఇక ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు.

మకర రాశి : మకర రాశి వారికి గురు వక్రగమనం, గురు ప్రభావంతో ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు.

వృషభ రాశి : వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. గురు వక్రగమనం వలన వీరికి ధనయోగం ఉంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది.



