అరటి పండు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా?
అరటి పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఆరోగ్య నిపుణులు ప్రతి రోజూ ఒక అరటి పండు తినాలని సూచిస్తుంటారు. అయితే కొంత మంది అరటి పండు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతుంటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అసలు అరటి పండు తిన్న తర్వాత నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదో కాదో, కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.
Updated on: Jul 21, 2025 | 4:59 PM

శక్తి స్థాయి పెరుగుతుంది: మీరు రోజంతా తరచుగా అలసిపోయినట్లు అనిపిస్తుందా? అరటిపండ్లు మీకు సహజ శక్తిని పెంచేవిగా పనిచేస్తాయి. ఇందులో సహజ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్) అలాగే ఫైబర్ ఉంటాయి. ఇది శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇది మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. వ్యాయామానికి ముందు లేదా తర్వాత రెండు అరటిపండ్లు తినడం ద్వారా, మీ శక్తి స్థాయిలో గొప్ప పెరుగుదలను మీరు అనుభవిస్తారు.

అందువలన రోజుకు ఒక అరటి పండు తింటే ఆ వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. అంతేకాకుండా బరువు పెరగాలి అనుకునే వారు రోజూ ఉదయం, సాయంత్రం సమయంలో ఒక అరటి పండు తినడం శరీరానికి చాలా మేలు చేస్తుందని దీని వలన త్వరగా బరుగు పెరగవచ్చు అంటారు. అంతే కాకుండా, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

అయితే కొంత మంది అరటి పండు తిన్న తర్వాత నీళ్లు తాగుతుంటారు. మరి మీరెప్పుడైన ఆలోచించారా? ఇది ఆరోగ్యానికి మంచిదో కాదో, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. అయితే అరటి పండు తిన్న తర్వాత నీళ్లు తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అరటి పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వలన జీర్ణసంబంధమైన సమస్యలు పెరుగుతాయంట. అంతే కాకుండా అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

అయితే దీనిని తిన్న వెంటనే నీళ్లు తాగడం వలన ఇది కడుపులో ఆమ్లత పెరుగుతుందంట. ఎసిడిటీ, కడుపులో వాపు, గ్యాస్, ఎసిడిటి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయంట. అందుకే అరటి పండు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదంట.



