చలికాలంలో విరివిగా లభించే రేగు పళ్లతో.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మీరూ ఓ లుక్కేయండి..
రేగు పండ్లు పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉంటాయి. వీటిని భానుడికి చిహ్నంగా భావిస్తారు. సంక్రాంతి సమయంలో భోగి రోజున పిల్లలు భోగభాగ్యాలు ప్రసాదించాలని ఈ పండ్లను పోస్తారు. భోగినాడు పోస్తారు కాబట్టి వీటిని భోగిపండ్లు అంటారు. రేగు పళ్లకు రకరకాల పేర్లున్నాయి. ...
Updated on: Jan 06, 2023 | 11:21 AM

సంక్రాంతి పండుగ వస్తుందనడానికి సూచనగా పల్లెల్లో రేగుచెట్లు విరగకాస్తుంటాయి. దోరగా ఎర్రగా పండిన రేగుపండ్లు నోరూరిస్తూ వుంటాయి. ఇక పట్టణాల్లో కూడా ఏ కూడలిలో చూసినా రేగుపండ్లు విరివిగా కనిపిస్తుంటాయి. తోపుడు బండ్ల చుట్టూచేరి రేగుపండ్లను విపరీతంగా కొనుగోలు చేయడం కనిపిస్తూ వుంటుంది.

రేగు పండు చూడ్డానికి చిన్నగా వుంటుంది.పచ్చిగా వున్నప్పుడు ఆకుపచ్చ రంగులో వున్నా, పక్వానికొచ్చాక రంగు మారుతుంది. పసుపు, ఆ పై ఎరుపు రంగుకు వస్తుంది. మన దేశంలో 90 రకాల రేగుపండ్లను పండిస్తున్నారు. ఇది మంచి ఔషధకారి. రేగు పండులో ఔషధ గుణాలు చాల వున్నాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది.

అజీర్తికి చాల మంచిది. గొంతు నొప్పిని,ఆస్తమాని కండరాల నెప్పిని తగ్గించే గుణం దీనిలో వుంది. రేగు చెట్టు బెరడును నీళ్లలో మరిగించి డికాక్షన్ గా తాగితే నీళ్ల విరేచనాలకు పని చేస్తుంది. కొన్ని ప్రాంతాలలో రేగు పండ్ల గుజ్జుతో వడియాలు పెట్టుకుంటారు.

రేగుపండ్లను ఒక అరలీటరు నీళ్లలో వేసి అవి సగం అయ్యే వరకు మరగనివ్వాలి. దానికి పంచదార కానీ తేనె గానీ కలిపి దానిని రోజూ పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తంలోకి గ్లుంటామిక్ ఆమ్లం ఎక్కువగా విడుదలై మెదడు బాగా పనిచేయడానికి ఉపకరిస్తుంది.

రేగు ఆకులను నూరి దాన్ని కురుపులు వంటి వాటి మీద రాసుకుంటే త్వరగా నయమవుతాయి. రేగు పండు తీయని పండే కాదు మంచి హెర్బల్ మందుగా కూడా పనిచేస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:



