AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు సూపర్ న్యూస్.. త్వరలో రూ.3 వేలకు పెంపు.. కీలక నిర్ణయం దిశగా కేంద్రం..

ఈపీఎఫ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా త్వరలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెన్షన్ పరిమితిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.వెయ్యిగా ఉంది. దీనిని రూ.7500కి పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం త్వరలో..

Venkatrao Lella
|

Updated on: Aug 15, 2026 | 12:50 PM

Share
ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ అందనుందా..? ఈపీఎఫ్ఓ పెన్షన్ పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచనుందా..? ప్రస్తుతం ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కనీస పెన్షన్ రూ.వెయ్యిగా ఉండగా.. దీనిని రూ.7500కి పెంచనున్నారా? గత కొంతకాలంగా ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ నెరవేరనుందా? అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ అందనుందా..? ఈపీఎఫ్ఓ పెన్షన్ పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచనుందా..? ప్రస్తుతం ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ కనీస పెన్షన్ రూ.వెయ్యిగా ఉండగా.. దీనిని రూ.7500కి పెంచనున్నారా? గత కొంతకాలంగా ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ నెరవేరనుందా? అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి.

1 / 5
కేంద్రం త్వరలోనే కనీస పెన్షన్‌ను పెంచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో పెంపును డిమాండ్ చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. దీంతో రూ.వెయ్యి పెన్షన్ సరిపోవడం లేదు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.7500కి పెంచాలని ఉద్యోగ సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టాయి.

కేంద్రం త్వరలోనే కనీస పెన్షన్‌ను పెంచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో పెంపును డిమాండ్ చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. దీంతో రూ.వెయ్యి పెన్షన్ సరిపోవడం లేదు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.7500కి పెంచాలని ఉద్యోగ సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టాయి.

2 / 5
ఈ క్రమంలో పార్లమెంట్‌లో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు కార్మికశాఖ సహాయమంత్రి శోభా కారంద్లేజ్ సమాధానమిస్తూ.. ఈపీఎస్ పెన్షన్ ఎప్పుడు పెంచుతామనే విషయంపై క్లారిటీ లేకపోయినా పెంపుకు అవకాశం ఉందనేలా స్పష్టతిచ్చారు. పెన్షనర్లకు ప్రభుత్వం బడ్జెట్ మద్దతు ద్వారా నెలకు కనీసం రూ.వెయ్యి అందిస్తోంది. ఈపీఎఫ్‌ఓకు EPS నిమిత్తం ఏటా అందించే వేతనాల్లో 1.16 శాతం మేర బడ్జెట్ మద్దతుకు అదనంగా ఈ సదుపాయం కల్పిస్తోందన్నారు.

ఈ క్రమంలో పార్లమెంట్‌లో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు కార్మికశాఖ సహాయమంత్రి శోభా కారంద్లేజ్ సమాధానమిస్తూ.. ఈపీఎస్ పెన్షన్ ఎప్పుడు పెంచుతామనే విషయంపై క్లారిటీ లేకపోయినా పెంపుకు అవకాశం ఉందనేలా స్పష్టతిచ్చారు. పెన్షనర్లకు ప్రభుత్వం బడ్జెట్ మద్దతు ద్వారా నెలకు కనీసం రూ.వెయ్యి అందిస్తోంది. ఈపీఎఫ్‌ఓకు EPS నిమిత్తం ఏటా అందించే వేతనాల్లో 1.16 శాతం మేర బడ్జెట్ మద్దతుకు అదనంగా ఈ సదుపాయం కల్పిస్తోందన్నారు.

3 / 5
ప్రభుత్వం త్వరలో పెన్షన్‌ను రూ.7500కి కాకపోయినా రూ.3 వేల వరకు అయినా పెంచే అవకాశముందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక పెన్షన్ పెంపుతో పాటు పెన్షనర్ల జీవిత భాగస్వామ్యులకు ఉచిత వైద్య సౌకర్యం అందించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

ప్రభుత్వం త్వరలో పెన్షన్‌ను రూ.7500కి కాకపోయినా రూ.3 వేల వరకు అయినా పెంచే అవకాశముందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక పెన్షన్ పెంపుతో పాటు పెన్షనర్ల జీవిత భాగస్వామ్యులకు ఉచిత వైద్య సౌకర్యం అందించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

4 / 5
ఈపీఎస్ పెన్షన్ పెంచాలని ఆగస్ట్ 5న ఢిల్లీలో ఈపీఎస్ 95 నేషనల్ అగిటేషన్ కమిటీ ఆందోళన నిర్వహించింది. పెన్షన్ పెంపుపై త్వరగా తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలో లోక్‌సభలో దీనిపై చర్చ జరగ్గా.. ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. త్వరలో పెంచితే ఉద్యోగులకు పండుగగా చెప్పవచ్చు.

ఈపీఎస్ పెన్షన్ పెంచాలని ఆగస్ట్ 5న ఢిల్లీలో ఈపీఎస్ 95 నేషనల్ అగిటేషన్ కమిటీ ఆందోళన నిర్వహించింది. పెన్షన్ పెంపుపై త్వరగా తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలో లోక్‌సభలో దీనిపై చర్చ జరగ్గా.. ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. త్వరలో పెంచితే ఉద్యోగులకు పండుగగా చెప్పవచ్చు.

5 / 5
Follow Us