e-Cycles: ఎయిర్ పొల్యూషన్ను కంట్రోల్ చేసేందుకు ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎలక్ట్రిక్ సైకిళ్లపై బంపర్ ఆఫర్..!
e-Cycles: ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ సైకిళ్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఢిల్లీలో ఎయిర్ పోల్యూషన్ను కంట్రోల్ చేసేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ సైకిళ్లు కొనుగోలుదారులకు సబ్సిడీ ..
Updated on: May 23, 2022 | 9:44 PM

e-Cycles: ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ సైకిళ్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఢిల్లీలో ఎయిర్ పోల్యూషన్ను కంట్రోల్ చేసేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ సైకిళ్లు కొనుగోలుదారులకు సబ్సిడీ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఆఫర్కు సంబంధించి ప్రభుత్వం వచ్చే వారం మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. పలు నివేదికల ప్రకారం.. గత ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎలక్ట్రిక్ సైకిళ్లపై సబ్సిడీ అందించనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో నివాసం ఉండే కొనుగోలుదారులకు ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లపై రూ.15వేల వరకు సబ్సిడీ అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

మొదటి 10వేల ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుదారులకు రూ.5,500 వరకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. తొలి వెయ్యిలోపు కొనుగోలుదారులకు రూ.2వేలు, తొలి 5వేలలోపు ఈ కార్గో సైకిల్ కొనుగోలుదారులకు రూ.15వేలలోపు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపింది.

ఈకార్గో సైకిల్తో ఫుడ్ డెలివరీతో పాటు ఇతర కమర్షియల్ వర్క్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ సైకిళ్లు తక్కేందుకు పెడల్ సౌకర్యం కూడా ఉంటుంది. ఛార్జింగ్ అయిపోతే పెట్టుకునేందుకు బ్యాటరీలు కూడా ఉంటాయి.





























