- Telugu News Photo Gallery Cricket photos Team India never won single test match in Chennai in the month of september check full details in telugu
IND vs BAN: చెన్నై టెస్ట్కు ముందే టీమిండియాకు బిగ్ షాక్.. భయపెడుతోన్న సెప్టెంబర్.. ఎందుకో తెలుసా?
IND vs BAN: చెన్నైలో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్న భారత జట్టుకు సెప్టెంబర్ చీకటి చరిత్ర పెద్ద సవాలుగా మారింది. మొత్తానికి సెప్టెంబర్ నెలకు చెన్నైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్కి టీమ్ ఇండియాకు సంబంధం ఏంటో తెలిస్తే షాక్ అవుతారంతే.. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Sep 18, 2024 | 6:59 PM

సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమ్ ఇండియా వైట్ జెర్సీతో మరోసారి మైదానంలోకి దిగనుంది. పూర్తి 6 నెలల తర్వాత, టీమ్ ఇండియా టెస్ట్ క్రికెట్ ఆడుతుంది. వరుసగా మూడోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవడానికి తమ ప్రచారాన్ని కొనసాగిస్తుంది.

చాలా కాలం తర్వాత టెస్టు క్రికెట్లో అడుగుపెడుతున్న రోహిత్ సేన బంగ్లాదేశ్ జట్టుకు ప్రత్యర్థిగా బరిలోకి దిగనుంది. ఇంతకుముందు బంగ్లాదేశ్ జట్టును ఈజీగా ఓడిస్తుందని అనిపించింది. కానీ, తాజాగా బంగ్ల జట్టు పాకిస్థాన్ను వారి గడ్డపై ఓడించింది. కాబట్టి ఈ జట్టును తక్కువ అంచనా వేయలేం.

వీటన్నింటి నడుమ చెన్నైలో టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన భారత జట్టుకు సెప్టెంబర్ చీకటి చరిత్ర పెద్ద సవాల్గా మారింది. మొత్తానికి సెప్టెంబర్ నెలకు చెన్నైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్కి టీమ్ ఇండియాకు సంబంధం ఏంటో చూద్దాం..

నిజానికి 1934లో చెన్నైలో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి చెన్నైలో మొత్తం 34 టెస్టు మ్యాచ్లు జరిగాయి. ఇందులో భారత జట్టు 15 టెస్టుల్లో విజయం సాధించగా, 11 మ్యాచ్లను డ్రా చేసుకుంది. మిగతా 7 మ్యాచ్ల్లోనూ టీమిండియా ఓడిపోయింది.

వివిధ సంవత్సరాల్లో సెప్టెంబర్ నెలలో ఈ మైదానంలో ఇప్పటివరకు 3 టెస్టు మ్యాచ్లు జరిగాయి. అయితే, ఈ మూడు టెస్టు మ్యాచ్ల్లో భారత జట్టు ఒక్కసారి కూడా గెలవలేదు. ఇందులో 2 మ్యాచ్లు డ్రా కాగా, 1 మ్యాచ్ టై అయింది.

సెప్టెంబరు 1979లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. ఆ తర్వాత 1982 సెప్టెంబర్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ కూడా డ్రా అయింది. 1986లో టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా టైగా ముగిసింది.

అప్పటి నుంచి అంటే 1986 నుంచి ఇప్పటి వరకు చెన్నైలో సెప్టెంబరు నెలలో టీమ్ ఇండియా ఎలాంటి టెస్టు ఆడలేదు. అంటే సెప్టెంబరులో ఇప్పటి వరకు టీమ్ఇండియా విజయం సాధించలేదు. కానీ, ఓటమిని కూడా చూడలేదు. ఇప్పుడు ఈ చరిత్రను మార్చే అవకాశం కెప్టెన్ రోహిత్ శర్మకు లభించింది.




