T20 World Cup: విజేతకు దక్కనున్న ప్రైజ్ మనీ ఇదే.. టీమిండియాకు ఎంత అందనుందంటే?
నవంబర్ 13న పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ టైటిల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఏదైనా ఒక జట్టు రూ.13 కోట్లు అందుకోనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.
Updated on: Nov 12, 2022 | 3:59 PM

నవంబర్ 13న టీ20 వరల్డ్కప్లో చివరి మ్యాచ్ పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఇరు జట్లు మధ్యాహ్నం 1.30 గంటలకు మెల్బోర్న్ మైదానంలో ట్రోఫీ కోసం తలపడనున్నాయి.

పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు టైటిల్పై కన్నేశాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు రూ.13 కోట్లు అందనున్నాయి.

ఈసారి టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ మనీ రూ. 45.68 కోట్లు. ఇది గత టీ20 ప్రపంచకప్తో సమానం.

టైటిల్ గెలిచిన జట్టుకు ఇందులో రూ.13.05 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. కాగా రన్నరప్ జట్టుకు సగం అంటే రూ.6.52 కోట్లు దక్కనున్నాయి.

మరోవైపు సెమీ ఫైనల్లో ఓడిన జట్లు అంటే భారత్, న్యూజిలాండ్లకు తలో రూ.32.63 లక్షలు లభిస్తాయి. ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్, పాకిస్థాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.