- Telugu News Photo Gallery Cricket photos IPL 2024 News: who will be rcb captain in ipl 2024 Know More Details
IPL 2024: ఆర్సిబి టీమ్ కెప్టెన్ను మళ్లీ మారుస్తున్నారా? ఇంట్రస్టింగ్ అప్డేట్స్.. !
IPL 2024 News: ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన సొంత గడ్డపై 7 మ్యాచ్లు ఆడగా.. కేవలం 3 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది.
Updated on: Jun 05, 2023 | 6:20 AM

IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గత 16 సీజన్లుగా టైటిల్ గెలుచుకోవాలనే కల ఇప్పటికే నెరవేరడం లేదు. ఆర్సీబీకి టైటిల్ అందని ద్రాక్షలా మారుతోంది. ‘కప్ నామ్దే’ అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించిన ఆర్సీబీ ఈసారి లీగ్ దశలోనే నిష్క్రమించి నిరాశపరిచింది.

ముఖ్యంగా 14 మ్యాచుల్లో 7 మాత్రమే గెలిచిన ఆర్సీబీ జట్టు నాయకత్వంపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై 7 మ్యాచ్లు ఆడింది. చిన్నస్వామి స్టేడియంలో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది.

2019 తర్వాత ఆర్సిబి జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. దీంతో ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గత రెండు సీజన్లలో డుప్లెసిస్ ఆర్సీబీ జట్టుకు కెప్టెన్సీ వహించాడు. ఐపీఎల్ సీజన్ 16లో ఫాఫ్ సారథ్యంలో ఆర్సీబీ మొత్తం 27 మ్యాచ్లు ఆడింది. అయితే 14 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. అంటే డుప్లెసిస్ సారథ్యంలో ఆర్సీబీ 13 మ్యాచుల్లో ఓడిపోయింది.

మరోవైపు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఈసారి కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ మూడు మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోనే 1 మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. అంటే డుప్లెసిస్ కెప్టెన్సీలో ఆర్సీబీ కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది.

డుప్లెసిస్ గైర్హాజరీతో ఈసారి విరాట్ కోహ్లి మూడు మ్యాచ్లకు ఆర్సిబి జట్టుకు నాయకత్వం వహించాడు. కెప్టెన్గా తన నేచురల్ దూకుడు స్వభావంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీన్ని బట్టి మళ్లీ కోహ్లికి ఆర్సీబీ ఫ్రాంచైజీ కెప్టెన్సీ ఇస్తుందా? అనే ప్రశ్న తలెత్తింది.

ఆర్సీబీ జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకోవడం వెనుక ప్రధాన కారణం నాయకత్వ భారమే. భారత జట్టును, ఆర్సీబీని నడిపించడం భారంగా మారుతోంది. తద్వారా లీగ్ క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని కోహ్లీ గతంలో ప్రకటించాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం విరాట్ కోహ్లీ పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.

ఫాఫ్ డుప్లెసిస్ వరుసగా రెండు సీజన్లలో జట్టును నడిపించినా.. ఆశించిన ప్రదర్శన రాలేదు. విరాట్ కోహ్లి నాయకత్వంలో ఆర్బీసీ 3 సార్లు ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించగా, ఒకసారి ఫైనల్ ఆడింది.

వీటన్నింటినీ పరిశీలిస్తే.. ఐపీఎల్ తదుపరి సీజన్లో ఆర్బీబీ ఫ్రాంచైజీ మళ్లీ విరాట్ కోహ్లీకి కెప్టెన్సీని ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
