- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Rishabh Pant shows up at Arun Jaitley Stadium to watch DC vs GT Match
IPL 2023: ఊత కర్ర సహాయంతో స్టేడియానికి వచ్చిన రిషబ్ పంత్.. ఫ్యాన్స్ హర్షధ్వానాలతో హోరెత్తిన స్టేడియం
గతేడాది జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఈ యాక్సిడెంట్ నుంచి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడీ స్టార్ ప్లేయర్
Updated on: Apr 05, 2023 | 6:00 AM

గతేడాది జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఈ యాక్సిడెంట్ నుంచి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడీ స్టార్ ప్లేయర్

గాయం కారణంగా పంత్ మెగా టోర్నీలన్నింటికి దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023కి కూడా దూరం అయ్యాడీ స్టార్ ప్లేయర్.

అయితే మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్కు రిషబ్ పంత్ హాజరయ్యాడు .

షార్ట్, వైట్ టీషర్ట్ వేసుకున్న పంత్ కర్ర సాయంతోనే స్టేడియానికి వచ్చాడు. ఈ సందర్భంగా పంత్కు అభిమానులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.

పంత్ రాకను మానిటర్లో గమనించిన సౌరవ్ గంగూలీ, హెడ్కోచ్ పాంటింగ్ సహా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి





























