- Telugu News Photo Gallery Cricket photos IND vs BAN 2nd T20I: India eye on 7th consecutive T20I series win as Bangladesh in Delhi
IND vs BAN: ఢిల్లీలో టీమిండియా అరుదైన ఫీట్.. బంగ్లాకు మరోసారి మడతడినట్లే
India vs Bangladesh: భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఢిల్లీ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. గ్వాలియర్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో జరిగే రెండో మ్యాచ్లో గెలిస్తే టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకోవడం ఖాయం. కానీ, ఢిల్లీలో బంగ్లాదేశ్ను తక్కువగా అంచనా వేయడం కష్టం కావొచ్చు.
Updated on: Oct 09, 2024 | 3:06 PM

India vs Bangladesh: భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఢిల్లీ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. గ్వాలియర్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో జరిగే రెండో మ్యాచ్లో గెలిస్తే టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకోవడం ఖాయం. కానీ, ఢిల్లీలో బంగ్లాదేశ్ను తక్కువగా అంచనా వేయడం కష్టం కావొచ్చు. ఎందుకంటే టీ20 ఫార్మాట్లో ఇక్కడ జరిగిన చివరి, ఏకైక ఎన్కౌంటర్లో బంగ్లాదేశ్ జట్టు భారత్ను ఓడించింది.

భారత్-బంగ్లాదేశ్ల మధ్య జరిగే మ్యాచ్ సిరీస్లో రెండో టీ20 మ్యాచ్ మాత్రమే కాదు, ఢిల్లీలో ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 పోరు కూడా కానుంది. అంతకుముందు, 2019లో ఢిల్లీలో జరిగిన టీ20 మ్యాచ్లో ఇరు జట్లు తలపడగా, అందులో భారత్ను ఓడించి బంగ్లాదేశ్ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది.

ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత, T20 మ్యాచ్ ఆడటానికి రెండు జట్లు మళ్లీ ఢిల్లీ మైదానానికి చేరుకున్నాయి. దీంతో పాత జ్ఞాపకాలు కచ్చితంగా కనిపిస్తాయని తెలిసిందే. ఆ జ్ఞాపకాలను వదిలేసి సిరీస్ సొంతం చేసుకోవాలని భారత జట్టు కోరుకుంటుంది. బంగ్లాదేశ్ సిరీస్ను సమం చేయాలని కోరుకుంటుంది. అయితే, టీ 20 ఫార్మాట్లో 2 సంవత్సరాలుగా విజయాలు సాధిస్తోన్న భారత జట్టు.. బంగ్లాను కూడా క్లీన్ స్వీప్ చేసుకోవాలని కోరుకుంటోంది.

ఇక్కడ టీమిండియా టీ20 సిరీస్ కైవసం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. నిజానికి, 2022 సంవత్సరం నుంచి ఇప్పటివరకు, టీమ్ ఇండియా తన గడ్డపై 5 జట్లపై 6 సిరీస్లను గెలుచుకుంది. ఇటువంటి పరిస్థితిలో, బంగ్లాదేశ్ను కూడా ఓడించినట్లయితే, ఆ జాబితాలో చేరిన ఆరో జట్టుగా మారుతుంది. భారత జట్టు 7వ సిరీస్ను కైవసం చేసుకుంటుంది.

2022 నుంచి ఇప్పటి వరకు టీమిండియా వరుసగా టీ20 సిరీస్లను గెలుచుకుంటుంది. అవేవో ఓసారి చూద్దాం.. ఆస్ట్రేలియాను రెండుసార్లు ఓడించింది. 2022లో ఒకసారి సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకుంది. మళ్లీ 2023లో 4-1తో గెలచుకుంది. ఇది కాకుండా, 2022 సంవత్సరంలో భారత్ 2-1తో దక్షిణాఫ్రికాను ఓడించింది. 2023లో శ్రీలంక, న్యూజిలాండ్లను 2-1 తేడాతో ఓడించి, 2024లో ఆఫ్ఘనిస్థాన్ను 2-0 తేడాతో ఓడించింది.




