ICC Women World Cup 2022: ప్రపంచ కప్‌ జట్టులో ఆ కీలక ప్లేయర్లకు హ్యాండిచ్చిన సెలక్టర్లు.. కారణం ఏంటంటే?

మిథాలీ రాజ్ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత్ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.

|

Updated on: Jan 06, 2022 | 1:21 PM

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రకటించారు. మిథాలీ రాజ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. స్మృతి మంధాన, ఝులన్ గోస్వామి, యువ షెఫాలీ వర్మ కూడా జట్టులోకి వచ్చారు. కానీ చాలా మంది కీలక ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. వీరిలో స్టార్ బ్యాట్స్‌మెన్ జెమీమా రోడ్రిగ్స్, ఆల్ రౌండర్ శిఖా పాండే ఉన్నారు. వీరే కాకుండా టీమ్‌కి దూరంగా ఉన్న కొందరు పేర్లు కూడా ఉన్నాయి. అయితే మహిళల ప్రపంచకప్ జట్టులో ఆమెకు చోటు దక్కకపోవడానికి కారణం ఏంటి.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రకటించారు. మిథాలీ రాజ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. స్మృతి మంధాన, ఝులన్ గోస్వామి, యువ షెఫాలీ వర్మ కూడా జట్టులోకి వచ్చారు. కానీ చాలా మంది కీలక ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. వీరిలో స్టార్ బ్యాట్స్‌మెన్ జెమీమా రోడ్రిగ్స్, ఆల్ రౌండర్ శిఖా పాండే ఉన్నారు. వీరే కాకుండా టీమ్‌కి దూరంగా ఉన్న కొందరు పేర్లు కూడా ఉన్నాయి. అయితే మహిళల ప్రపంచకప్ జట్టులో ఆమెకు చోటు దక్కకపోవడానికి కారణం ఏంటి.

1 / 5
జెమీమా రోడ్రిగ్స్ జట్టులో చోటు దక్కించుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. గత ఏడాది కాలంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీ20 లీగ్‌లలో చాలా పరుగులు చేసింది. జెమీమా 100-బంతుల టోర్నమెంట్ ది హండ్రెడ్‌లో ఏడు మ్యాచ్‌లలో 41.50 సగటుతో, 150.90 స్ట్రైక్ రేట్‌తో 249 పరుగులు చేసింది. మొత్తం టోర్నీలో పరుగులు చేయడంలో రెండో స్థానంలో నిలిచింది. అదే సమయంలో, మహిళల బిగ్ బాష్ లీగ్‌లో, ఆమె 13 మ్యాచ్‌లలో 27.75 సగటుతో 333 పరుగులు చేసింది. అయితే గతేడాది ఒక్క వన్డే మ్యాచ్‌లోనూ జెమీమా రెండంకెల స్కోరును అందుకోలేకపోయింది. దీని కారణంగా ఆమె ప్రపంచ కప్‌నకు ఎంపిక కాలేదు. అయితే ప్రస్తుత ఫామ్‌ను పట్టించుకోలేదు. జెమీమా ఇప్పటి వరకు 21 వన్డేల్లో 19.70 సగటుతో 394 పరుగులు చేసింది.

జెమీమా రోడ్రిగ్స్ జట్టులో చోటు దక్కించుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. గత ఏడాది కాలంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీ20 లీగ్‌లలో చాలా పరుగులు చేసింది. జెమీమా 100-బంతుల టోర్నమెంట్ ది హండ్రెడ్‌లో ఏడు మ్యాచ్‌లలో 41.50 సగటుతో, 150.90 స్ట్రైక్ రేట్‌తో 249 పరుగులు చేసింది. మొత్తం టోర్నీలో పరుగులు చేయడంలో రెండో స్థానంలో నిలిచింది. అదే సమయంలో, మహిళల బిగ్ బాష్ లీగ్‌లో, ఆమె 13 మ్యాచ్‌లలో 27.75 సగటుతో 333 పరుగులు చేసింది. అయితే గతేడాది ఒక్క వన్డే మ్యాచ్‌లోనూ జెమీమా రెండంకెల స్కోరును అందుకోలేకపోయింది. దీని కారణంగా ఆమె ప్రపంచ కప్‌నకు ఎంపిక కాలేదు. అయితే ప్రస్తుత ఫామ్‌ను పట్టించుకోలేదు. జెమీమా ఇప్పటి వరకు 21 వన్డేల్లో 19.70 సగటుతో 394 పరుగులు చేసింది.

2 / 5
పేలవ ఫామ్ కారణంగా ఆల్ రౌండర్ శిఖా పాండేకు జట్టులో చోటు దక్కలేదు. 2021 సంవత్సరంలో మూడు వన్డేలు ఆడి, ఐదు పరుగులు మాత్రమే చేసింది. అలాగే ఆమె ఖాతాలో కేవలం రెండు వికెట్లు మాత్రమే వచ్చాయి. భారత్‌కు చెందిన అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో శిఖా పాండే ఒకరిగా నిలిచింది. ఝులన్ గోస్వామితో పాటు భారత్ బౌలింగ్ ఎటాక్ బాధ్యతలను ఆమె నిర్వహిస్తోంది. 55 వన్డేల్లో 20.48 సగటుతో 512 పరుగులు, 75 వికెట్లు పడగొట్టింది. గత కొన్నేళ్లుగా ఆమె భారత జట్టులో అంతర్భాగంగా ఉంది.

పేలవ ఫామ్ కారణంగా ఆల్ రౌండర్ శిఖా పాండేకు జట్టులో చోటు దక్కలేదు. 2021 సంవత్సరంలో మూడు వన్డేలు ఆడి, ఐదు పరుగులు మాత్రమే చేసింది. అలాగే ఆమె ఖాతాలో కేవలం రెండు వికెట్లు మాత్రమే వచ్చాయి. భారత్‌కు చెందిన అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో శిఖా పాండే ఒకరిగా నిలిచింది. ఝులన్ గోస్వామితో పాటు భారత్ బౌలింగ్ ఎటాక్ బాధ్యతలను ఆమె నిర్వహిస్తోంది. 55 వన్డేల్లో 20.48 సగటుతో 512 పరుగులు, 75 వికెట్లు పడగొట్టింది. గత కొన్నేళ్లుగా ఆమె భారత జట్టులో అంతర్భాగంగా ఉంది.

3 / 5
పూనమ్ రౌత్ భారత అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచింది. గత ఏడాదిలో నిలకడగా పరుగులు చేసిన ఆటగాళ్లలో ఆమె ఒకరిగా పేరుగాంచింది. 2021లో పూనమ్ ఆరు వన్డేల్లో 73.75 సగటుతో 295 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆమె బ్యాట్ నుంచి ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు వచ్చాయి. కానీ, ఆమె స్లో బ్యాటింగ్ కారణంగా సెలక్టర్లు ఇతర బ్యాటర్లను ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది. దక్షిణాఫ్రికాపై స్వదేశంలో, ఇంగ్లండ్ పర్యటనలో పరుగులు చేసింది. అయితే పూనమ్ స్ట్రైక్ రేట్‌ను ఓపెనర్ స్కోర్ చేసినంత వేగంగా కొనసాగించలేకపోయింది. దీంతో భారత్ సగటు స్కోరుకు మించి ముందుకు సాగలేకపోయింది. పూనమ్ ఇప్పటివరకు 73 వన్డేల్లో 34.83 సగటుతో 2299 పరుగులు చేసింది. ఆమె పేరు మీద మూడు సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

పూనమ్ రౌత్ భారత అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచింది. గత ఏడాదిలో నిలకడగా పరుగులు చేసిన ఆటగాళ్లలో ఆమె ఒకరిగా పేరుగాంచింది. 2021లో పూనమ్ ఆరు వన్డేల్లో 73.75 సగటుతో 295 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆమె బ్యాట్ నుంచి ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు వచ్చాయి. కానీ, ఆమె స్లో బ్యాటింగ్ కారణంగా సెలక్టర్లు ఇతర బ్యాటర్లను ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది. దక్షిణాఫ్రికాపై స్వదేశంలో, ఇంగ్లండ్ పర్యటనలో పరుగులు చేసింది. అయితే పూనమ్ స్ట్రైక్ రేట్‌ను ఓపెనర్ స్కోర్ చేసినంత వేగంగా కొనసాగించలేకపోయింది. దీంతో భారత్ సగటు స్కోరుకు మించి ముందుకు సాగలేకపోయింది. పూనమ్ ఇప్పటివరకు 73 వన్డేల్లో 34.83 సగటుతో 2299 పరుగులు చేసింది. ఆమె పేరు మీద మూడు సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

4 / 5
వీరితో పాటు సుష్మా వర్మ, వేదా కృష్ణమూర్తి, మోనా మెష్రామ్, మాన్సీ జోషి, నుజత్ పర్వీన్ వంటి క్రీడాకారిణులకు కూడా చోటు దక్కలేదు. 2018 నుంచి వేద వన్డేలు ఆడలేదు. గతేడాది కూడా ఆమె క్రికెట్‌కు దూరంగా ఉంది. ఈ సమయంలో ఈ సమయంలో ఆమె కుటుంబం ముందు చాలా చెడ్డ దశను ఎదుర్కోవలసి వచ్చింది. వేద తల్లి, సోదరి కరోనాతో చనిపోయారు. అదే సమయంలో మోనా, సుష్మ కూడా తమ ఆటతో ఆకట్టుకోలేకపోయారు. యువ క్రీడాకారిణి నుజత్ పర్వీన్ కూడా అందివచ్చిన అవకాశాల్లో రాణించలేకపోయింది.

వీరితో పాటు సుష్మా వర్మ, వేదా కృష్ణమూర్తి, మోనా మెష్రామ్, మాన్సీ జోషి, నుజత్ పర్వీన్ వంటి క్రీడాకారిణులకు కూడా చోటు దక్కలేదు. 2018 నుంచి వేద వన్డేలు ఆడలేదు. గతేడాది కూడా ఆమె క్రికెట్‌కు దూరంగా ఉంది. ఈ సమయంలో ఈ సమయంలో ఆమె కుటుంబం ముందు చాలా చెడ్డ దశను ఎదుర్కోవలసి వచ్చింది. వేద తల్లి, సోదరి కరోనాతో చనిపోయారు. అదే సమయంలో మోనా, సుష్మ కూడా తమ ఆటతో ఆకట్టుకోలేకపోయారు. యువ క్రీడాకారిణి నుజత్ పర్వీన్ కూడా అందివచ్చిన అవకాశాల్లో రాణించలేకపోయింది.

5 / 5
Follow us
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..