- Telugu News Photo Gallery Cricket photos From Ambati Rayudu to Amit Mishra these 4 team india players career finished in virat kohli and ms dhoni captaincy
Team India:ధోనీ-కోహ్లీల దెబ్బకు.. కెరీర్ ముగించిన అన్లక్కీ ప్లేయర్స్.. లిస్టులో నలుగురు..
Team India Cricketers: మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసిన నలుగురు టీమ్ ఇండియా క్రికెటర్లు ఉన్నారు. సెలెక్టర్లతోపాటు కెప్టెన్లు కూడా వీరిని నిర్లక్ష్యం చేశారు. ఈ లిస్టులో ఓ హైదరాబాదీ ప్లేయర్ కూడా ఉన్నాడు.
Updated on: May 08, 2023 | 8:29 PM

Team India: మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసిన నలుగురు టీమ్ ఇండియా క్రికెటర్లు ఉన్నారు. సెలెక్టర్లు ఈ నలుగురు ఆటగాళ్లను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. అలాగే కెప్టెన్లు కూడా వీరిని పట్టించుకోలేదు. దీంతో టీమ్ ఇండియా నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ నలుగురు ఆటగాళ్లకు జరిగిన వివక్షపై ప్రజలు ఇప్పటికీ ప్రశ్నలను లేవనెత్తుతూనే ఉన్నారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ హయంలో ఈ ఆటగాళ్లకు ఎక్కువగా అన్యాయం జరిగింది. దీని కారణంగా వారి కెరీర్ ఊహించని విధంగా ముగిసింది. ఆ నలుగురు దురదృష్టకర క్రికెటర్లను ఓసారి చూద్దాం..

1. అంబటి రాయుడు: ఇంగ్లండ్ అండ్ వేల్స్లో 2019 ప్రపంచ కప్లో భారత క్రికెట్ జట్టు విజయ పథంలో నడుస్తోంది. అలాంటి సమయంలోనే భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు రిటైర్ అయ్యాడు. నిజానికి 2019 ప్రపంచకప్కు జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు అంబటి రాయుడిని కవర్ ప్లేయర్గా ఎంచుకున్నారు. అయితే మొదట శిఖర్ ధావన్ స్థానంలో రిషబ్ పంత్ను ఇంగ్లండ్కు పిలిచారు. ఆల్రౌండర్ విజయ్ శంకర్ గాయపడటంతో, మయాంక్ అగర్వాల్ను ఇంగ్లాండ్ నుంచి పిలిపించారు. అంబటి రాయుడు ఉన్నా వరుసగా 2 సార్లు పట్టించుకోలేదు. మయాంక్ అగర్వాల్కు 2019 ప్రపంచకప్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించనప్పటికీ, అతను 15 మంది సభ్యుల జట్టులో భాగమయ్యాడు. విరాట్ కోహ్లి అంబటి రాయుడిని పట్టించుకోలేదు. బహుశా దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ హైదరాబాదీ ప్లేయర్ తన రిటైర్మెంట్ ప్రకటించి, షాక్ ఇచ్చాడు.

2. అమిత్ మిశ్రా: ఒకప్పుడు భారత క్రికెట్ జట్టులో అమిత్ మిశ్రా పేరు గురించి చాలా చర్చ జరిగింది. ఈ లెగ్ స్పిన్నర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. కానీ, అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. అమిత్ మిశ్రాకు ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వలేదు. అమిత్ మిశ్రా భారత క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అమిత్ అరంగేట్రం చేశాడు. అమిత్ మిశ్రా 22 టెస్టుల్లో 76 వికెట్లు తీశాడు. అదే సమయంలో, అమిత్ మిశ్రా 2003లో దక్షిణాఫ్రికాపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అమిత్ మిశ్రా 36 వన్డేల్లో 4.73 ఎకానమీ రేటుతో 64 వికెట్లు పడగొట్టాడు. అమిత్ మిశ్రా 10 టీ20 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీశాడు. అయితే కెప్టెన్లు తగినంత అవకాశాలు ఇవ్వని దురదృష్టకర ఆటగాళ్ల జాబితాలో ఈ ఆటగాడు చేరాడు.

3. మనోజ్ తివారీ: మనోజ్ తివారీ భారత క్రికెట్ జట్టులో ఆకట్టుకున్నాడు. తివారీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ప్రదర్శన చేసి టీమ్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. మనోజ్ తివారీ 2008లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మనోజ్ తివారీ ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. 12 ODIలలో తివారీ 26.09 సగటుతో 287 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 104 పరుగులు. అదేవిధంగా 2011 సంవత్సరంలో T20 ఇంటర్నేషనల్లో అరంగేట్రం చేశాడు. అయితే, కేవలం 3 మ్యాచ్లలో మాత్రమే అవకాశం వచ్చింది.

4. వరుణ్ ఆరోన్: భారత క్రికెట్ జట్టు బౌలర్ వరుణ్ ఆరోన్ క్రికెట్ కెరీర్ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఆరోన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 63 మ్యాచ్ల్లో బౌలింగ్ చేసి 167 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన చూసిన సెలక్టర్లు వరుణ్కి భారత క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినా.. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం అతనికి తగినన్ని అవకాశాలు ఇవ్వలేదు. 2011లో వెస్టిండీస్పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. వరుణ్ ఆరోన్ 9 టెస్టుల్లో 18 వికెట్లు తీశాడు. వరుణ్ ఆరోన్ 2011లో ఇంగ్లండ్పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వరుణ్ ఆరోన్ 9 వన్డేల్లో 11 వికెట్లు తీశాడు. వరుణ్ ఆరోన్ 2015 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇప్పటి వరకు ఈ ఆటగాడికి అవకాశం రాలేదు.





























