- Telugu News Photo Gallery Covid cases showing signs of increase in Maharashtra; new Omicron subvariant detected
New Corona Variant: దేశంలో మరో కొత్త కరోనా వేరియంట్.. ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే..
కరోనా మహమ్మారి అంతరించిపోయిందనే లోపు దేశంలో మరో కొత్త వేరియంట్ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడు కొత్త వేరియంట్ పుట్టుకురావడంతో భయాందోళన చెందుతున్నారు. దాని లక్షణాలు ఎలా ఉంటాయన్నది శాస్త్రవేత్తలు గుర్తించారు. దేశంలోనే తొలిసారిగా ఈ వేరియంట్కు చెందిన ఓ రోగిని గుర్తించారు. బీజే మెడికల్ కాలేజీ సీనియర్ రీసెర్చర్, మహారాష్ట్ర జీనోమ్ సీక్వెన్సింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ కర్క్టే ప్రకారం..
Updated on: Aug 08, 2023 | 6:55 PM

గత కొన్ని రోజులుగా దాదాపు అంతరించిపోతున్న కరోనా వైరస్ మహారాష్ట్రలో మరోసారి ఊపందుకుంది. రాష్ట్రంలో మరోసారి కరోనా రోగుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. దీనితో పాటు, కరోనా ఓమిక్రాన్ EG.5.1 కొత్త వేరియంట్ కూడా గుర్తించారు నిపుణులు.

దేశంలోనే తొలిసారిగా ఈ వేరియంట్కు చెందిన ఓ రోగిని గుర్తించారు. బీజే మెడికల్ కాలేజీ సీనియర్ రీసెర్చర్, మహారాష్ట్ర జీనోమ్ సీక్వెన్సింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ కర్క్టే ప్రకారం.. ఓమిక్రాన్ EG.5.1 వేరియంట్ మేలో గుర్తించినట్లు ఆయన చెప్పారు. అయితే దీని తరువాత జూన్, జూలై నెలలో ఈ వేరియంట్ రోగుల సంఖ్య ఎక్కువగా లేదని, గత రెండు నెలల్లో రాష్ట్రంలో కేవలం XBB.1.16, XBB.2.3 వేరియంట్లు మాత్రమే గుర్తించామని పేర్కొన్నారు.

రాష్ట్ర ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం.. ఆగస్టు నెలలో కరోనా రోగుల సంఖ్య పెరిగింది. జూలై చివరి నాటికి, రాష్ట్రంలో క్రియాశీల కరోనా రోగుల సంఖ్య 70కి చేరుకుంది. అయితే ఆగస్టు 6న కరోనా రోగుల సంఖ్య 115గా తేలింది. సోమవారం నాడు మొత్తం యాక్టివ్ కరోనా రోగుల సంఖ్య 109. పెరుగుతున్న రోగుల సంఖ్యకు Omicron EG.5.1 వేరియంట్ కారణమని భావిస్తున్నారు. ఇంతకుముందు ఈ EG.5.1 వేరియంట్ ఇంగ్లాండ్లో ఆందోళన కలిగించింది. ఈ వైవిధ్యం కారణంగా, ఇంగ్లాండ్లో కరోనా రోగుల సంఖ్య వేగంగా పెరిగింది.

కొత్త కరోనా లక్షణాలు: కొత్త కరోనా వేరియంట్పై ఎలాంటి లక్షణాలు ఉంటాయన్నది శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్లో జన్యు పరమైన మార్పులు ఉండటం కారణంగా కొత్త వేరియంట్ వస్తోందన్నారు. లక్షణాలను ముందస్తుగా గుర్తించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ వేరియంట్ సోకిన వారిలో గత ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలే ఉంటాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్లో ముక్కు కారడం, అధికంగా తలనొప్పి ఉండటంతో పాటు గొంతు నొప్పి, ఎక్కువగా తుమ్ములు రావడం, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు ఉంటున్నాయని అన్నారు.

Omicron వేరియంట్ EG.5.1 దేశవ్యాప్తంగా ఇంకా చాలా మంది రోగులను గుర్తించాల్సి ఉంది. అయితే ఆసుపత్రిలో చేరిన కొత్త కరోనా రోగులను పర్యవేక్షిస్తున్నారు పరిశోధకులు. ప్రస్తుతం ముంబైలో 43 మంది కరోనా యాక్టివ్ పేషెంట్లు ఉన్నారు. దీని తరువాత పూణేలో 34 మంది, థానేలో 25 మంది యాక్టివ్ కరోనా రోగులు ఉన్నారు. రాయ్గఢ్, సాంగ్లీ, షోలాపూర్, సతారా మరియు పాల్ఘర్లలో ఒక్కొక్కరు యాక్టివ్ పేషెంట్ ఉన్నారు.




