వర్షంలో తడుస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. కలెక్టర్ మానవత్వానికి నెటిజన్ల ప్రశంసలు!
జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్.. మాడుగులలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కారులో బయల్దేరారు. ఈ క్రమంలోనే బంగారు మెట్ట కూడలిలో కొంతమంది విద్యార్థులు వర్షంలో తడుస్తూ కనిపించారు. ఈ విషయాన్ని కలెక్టర్ గమనించి వెంటనే తన కారు ఆపారు. వారి నుంచి వాకబు చేశారు. బస్సు కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్న విషయాన్ని కలెక్టర్ గమనించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
