Tollywood:రెండు సార్లు అబార్షన్.. మళ్లీ శుభవార్త చెప్పిన టాలీవుడ్ యాంకరమ్మ
ప్రముఖ బుల్లితెర నటి, టాలీవుడ్ ఫేమస్ యాంకర్ శుభవార్త చెప్పింది. తాన మరోసారి అమ్మకానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ అందాల యాంకరమ్మకు సామాజిక మాధ్యమాల వేదికగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Updated on: Jan 22, 2025 | 1:37 PM

ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్ సమీరా షెరీఫ్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోన తాను అమ్మగా ప్రమోషన్ పొందనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

తన కుమారుడు అర్హాన్తో ఆడుకునేందుకు త్వరలోనే మరో బుజ్జాయి తమ ఇంట్లోకి రాబోతుందని పేర్కొంది సమీరా. జూలై 4న తనకు డెలివరీ డేట్ ఇచ్చారని కూడా వెల్లడించిందీ యాంకరమ్మ.

దీంతో పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సమీరా దంపతులకు ముందస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

కాగా సమీరా గర్భం ధరించడం ఇది నాలుగోసారి. 2019లో అన్వర్ జాన్ను పెళ్లి చేసుకున్న ఆమె 2020లో ప్రెగ్నెంట్ అయింది కానీ అబార్షన్ అయ్యింది.

రెండోసారి గర్భం దాల్చినప్పుడు అర్హాన్ పుట్టాడు. ఇక 2023లో మూడోసారి సమీరా గర్భం దాల్చగా బిడ్డ ఎదుగుదల ఆగిపోయింది. దీంతో మళ్లీ ఆమెకు నిరాశ తప్పలేదు. ఇప్పుడు మళ్లీ నాలుగోసారి గర్భం ధరించింది సమీరా.

ఆడపిల్ల, అభిషేకం, ముద్దు బిడ్డ, భార్యామణి, మూడు ముళ్ల బంధం సీరియల్స్ లో నటించిన సమీర అదిరింది వంటి టీవీ ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా వ్యవహరించింది.




