అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
ఎప్పుడూ తన సినిమా విషయాలగురించి ప్రస్తావించే దర్శక ధీరుడు రాజమౌళి, ఈ మధ్య తన సినిమా ప్రస్తావన వచ్చినా సరే ఆయన ఏం మాట్లాడటం లేదు. తన సినిమా విశేషాలను ఆయన చాలా గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో తన అభిమానులందరూ ఏంటీ జక్కన్న ఈ మధ్య తన సినిమా విషయాలను పంచుకోవడం లేదని
Updated on: Jan 09, 2025 | 3:34 PM

గతంలో తన సినిమాల విశేషాలను స్వయంగా అభిమానులతో షేర్ చేసుకునే వారు దర్శక ధీరుడు రాజమౌళి. సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు ప్రెస్మీట్ పెట్టి సినిమా విశేషాలు రివీల్ చేసేవారు. కానీ అప్కమింగ్ మూవీ విషయంలో మాత్రం ఈఫార్ములాను బ్రేక్ చేస్తున్నారు జక్కన్న. ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఎవరు మాట్లాడినా కర్ర తీసుకొని వెంటపడుతున్నారు. అసలు జక్కన్న ఎందుకిలా చేస్తున్నారు.

బాహుబలి, ట్రిపులార్ సినిమాల విషయంలో ముందు నుంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు రాజమౌళి. సినిమా ఎనౌన్స్మెంట్ ను కూడా గ్రాండ్గా నిర్వహించారు. కానీ ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 విషయంలో మాత్రం కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు రాజమౌళి. సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సీక్రెట్గా మెయిన్టైన్ చేస్తున్నారు.

ఇతర సినిమాల ఫంక్షన్స్లో కనిపించినా... మహేష్ మూవీ గురించి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు రాజమౌళి. గేమ్ చేంజర్ వేదిక మీద ఎస్ఎస్ఎంబీ 29 ప్రస్తావన వచ్చినా... ఏ మాత్రం క్లూ ఇవ్వలేదు. షూటింగ్ టైమ్ లైన్స్ విషయంలోనూ ఎలాంటి కమిట్మెంట్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు.

మత్తువదలారా 2 ప్రమోషన్స్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా జక్కన్నను కలిసి మత్తు వదలరా 2 టీమ్, మహేష్ మూవీ గురించి అడిగింది. వెంటనే కర్ర తీసుకొని వెంటపడ్డారు జక్కన్న.

సరదాగా ప్లాన్ చేసిన వీడియోనే అయినా... సినిమా అప్డేట్స్ విషయంలో తన ఇన్టెన్షన్ ఏంటో ఆడియన్స్కు క్లియర్గా చెప్పారు జక్కన్న. మరో ఏడాది పాటు సినిమా గురించి ఎవ్వరూ మట్లాడకూడదని అందరికీ అర్థమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.





























