Heroine Radhika Apte : ఒక్క సినిమాకు నాతో డబుల్ వర్క్ చేయించారు.. సంచలన కామెంట్లు చేసిన హీరోయిన్..
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లెజండ్ సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ రాధికా ఆప్టే .
Updated on: May 22, 2021 | 10:17 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లెజండ్ సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ రాధికా ఆప్టే .

అంతకన్నా ముందు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాలో నటించింది ఈ బ్యూటీ.

ఆతర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది రాధికా ఆప్టే. సినిమాలతోనే కాదు ఈ ముద్దుగుమ్మ వివాదాలతోను బాగానే పాపులర్ అయ్యింది.

తాజాగా ఓ ప్రముఖ దర్శకుడి పై సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆయన ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ

ఆయనతో ఓ సినిమాకి అంగీకరించాను. కానీ తక్కువ వేతనంతో పని చేయాల్సి వచ్చిందని వాపోయారు.

ఒక్క బాషలోనే సినిమా ఉంటుందని చెప్పి రెండు భాషల్లో తెరకెక్కించి డబుల్ వర్క్ చేయించారన్న రాధికా

ఆ సినిమాకి పని చేసిన సమయంలో గంటల కొద్దీ సమయం సెట్లో వేచి చూడాల్సి వచ్చేది. నాతో పని చేసే హీరోలంతా పెద్ద వాళ్లు కావడంతో వారు రావడం ఆలస్యమయ్యేది అంటూ చెప్పుకొచ్చింది.





























