OTT: ఈ వారం డిజిటల్ వేదిక సందడి సిద్దమైన సినిమాలు.. సిరీసులు ఇవే..
ప్రతివారం డిజిటల్ వేదిక చాల సినిమాలు వస్తాయి. వీటిని చాలామంది ప్రజలు ఆదరిస్తారు. అలాగే ఓటీటీలోకి ఈ వారం కొన్ని సినిమాలు సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈసారి అలరించడానికి సిద్ధం సినిమాలు ఏంటి.? సిరీసులు ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం రండి..
Updated on: Apr 17, 2025 | 8:50 PM

“యమకాథఘి” తమిళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం, పెప్పిన్ జార్జ్ జయశీలన్ రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రూప కొడువాయూర్, నరేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆహాలో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

ఈటీవీ విన్ కథా సుధలో భాగంగా వస్తున్న ఎమోషనల్ డ్రామా చిత్రం “వెండి పట్టిలు”. ఈ చిత్రం దాదాపు 35-40 నిమిషాల నిడివి ఉంటుంది. ఒక తండ్రి తన కూతురికి ఒక జత కాళ్ళజోడు కొనడానికి చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం ఏప్రిల్ 20, 2025న ఈటీవీ విన్ OTT ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అవుతుంది.

“ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2” అనే ఓ జోంబీ అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది ఏప్రిల్ 14 నుంచి జియోహాట్స్టార్ వేదికగా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నాటీ డాగ్ అభివృద్ధి చేసిన వీడియో గేమ్ ఫ్రాంచైజీ ఆధారంగా రూపొందింది.

“స్ట్రేంజర్ థింగ్స్: ది ఫస్ట్ షాడో (స్ట్రేంజర్ థింగ్స్ బిహైండ్ ది సీన్స్ డాక్యుమెంటరీ)” ఏప్రిల్ 15న నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. హాలీవుడ్ ప్రేమికులకు ఇది మంచి ఆప్షన్. కచ్చితంగా చుడండి. అస్సలు మిస్ కావద్దు.

“ఖౌఫ్” అనే ఓ హిందీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ మధు అనే హాస్టల్ యువతీ చుట్టూ తిరుగుతుంది. ఆమె హాస్టల్ కి వచ్చినప్పుడు ఏమి జరిగింది.? దీని నుంచి ఎలా బయట పడుతుంది.? అన్నది కథ.





























