టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్.. క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్న నిర్మాతలు
ఓ బిల్డింగ్ కట్టాలంటే ముందు పునాది బలంగా ఉండాలి.. ఆ తర్వాత దాని మీద ఎన్ని ఫ్లోర్స్ అయినా వేయొచ్చు. ఇండస్ట్రీలోనూ ఇదే జరుగుతుంది. ముందు ఓ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు.. ఆ తర్వాత సీక్వెల్స్తో వాటిని క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా టిల్లు భాయ్ చేసింది కూడా ఇదే. టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్పై స్పెషల్ స్టోరీ.. ఒకప్పుడు సీక్వెల్ అనే మాట వింటే చాలు మన నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. దానికి కారణం కూడా లేకపోలేదు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Mar 30, 2024 | 12:04 PM

ఓ బిల్డింగ్ కట్టాలంటే ముందు పునాది బలంగా ఉండాలి.. ఆ తర్వాత దాని మీద ఎన్ని ఫ్లోర్స్ అయినా వేయొచ్చు. ఇండస్ట్రీలోనూ ఇదే జరుగుతుంది. ముందు ఓ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు.. ఆ తర్వాత సీక్వెల్స్తో వాటిని క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా టిల్లు భాయ్ చేసింది కూడా ఇదే. టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్పై స్పెషల్ స్టోరీ..

ఒకప్పుడు సీక్వెల్ అనే మాట వింటే చాలు మన నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. దానికి కారణం కూడా లేకపోలేదు. శంకర్ దాదా జిందాబాద్, గాయం 2, సర్దార్ గబ్బర్ సింగ్, కిక్ 2, నాగవల్లి, ఆర్య 2.. ఇలా ఒకటా రెండా కొన్నేళ్ల వరకు సీక్వెల్స్ అన్నీ ఫ్లాపులే. కానీ కార్తికేయ 2, బంగార్రాజు, ఎఫ్ 3 లాంటి సినిమాలతో ఇప్పుడా సెంటిమెంట్ మారింది.

సీక్వెల్స్ హిట్ అవుతుండటంతో అదే ట్రెండ్ చేస్తున్నారు మేకర్స్. పాత కథలకు కొనసాగింపు చేస్తున్నారు దర్శకులు. అలా చేస్తే.. ప్రాజెక్ట్పై అంచనాలు పెంచాల్సిన పనే లేదు.. ముందు సినిమానే అన్నీ చూసుకుంటుంది. ఆ బ్రాండ్పైనే ఇంకో సినిమా చేస్తున్నారు. తాజాగా టిల్లు స్క్వేర్పై ఈ రేంజ్ అంచనాలకు.. ఓపెనింగ్స్కు కారణం కూడా డిజే టిల్లు అనే బ్రాండ్.

బాహుబలి, కేజియఫ్కు ఈ సీక్వెల్స్ బాగా హెల్ప్ అయ్యాయి. అందుకే పుష్ప, దేవర, సలార్కు ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. ఇవన్నీ ఒకే కథను రెండు భాగాలుగా చెప్పడం. కానీ కొందరు కారెక్టర్ను తీసుకుని సీక్వెల్ చేస్తూ.. ఆ క్రేజ్ క్యాష్ చేసుకుంటున్నారు. ఎఫ్ 2కు ఎఫ్ 3.. డిజే టిల్లుకు టిల్లు స్క్వేర్ అలాగే చేసారు. ఇప్పుడు ప్రతినిథి సీక్వెల్ ప్రతినిథి 2 అలాగే వస్తుంది.

గూడచారితో అదరగొట్టిన అడివి శేష్.. ఇప్పుడు గూడఛారి 2తో రానున్నారు. అలాగే ఇస్మార్ట్ శంకర్ కారెక్టరైజేషన్తోనే డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు పూరీ జగన్నాథ్. దీనిపై అంచనాలు పెగరడానికి ఇస్మార్ట్ శంకర్ అనే బ్రాండ్ కారణం. ఇక ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ను ప్రకటించారు. రాజ రాజ చోరకు సీక్వెల్గా స్వాగ్ అనే సినిమా చేస్తున్నారు శ్రీ విష్ణు. ఇలా ఎటు చూసినా సీక్వెల్సే కనిపిస్తున్నాయిప్పుడు.





























