- Telugu News Photo Gallery Cinema photos Bhagyashri Borse has become Tollywood's most wanted heroine and busy with a series of films
Bhagyashri Borse: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్గా భాగ్యశ్రీ.. వరుస సినిమాలతో బిజీ బిజీగా..
భాగ్యశ్రీ బోర్సే.. రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్గా టాలీవుడ్ అరంగట్రం చేసి తన అందం, సొగసు వలవేసి తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసింది. దీంతో తెలుగు ఈ బ్యూటీకి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో తెలుగులో బిజీ అయిపొయింది. ఈ ముద్దుగుమ్మ లైనప్లో ఉన్న సినిమాలు ఏంటి.? ఈరోజు మనం తెలుసుకుందాం..
Updated on: May 15, 2025 | 4:56 PM

రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ అరంగట్రం చేసింది సొగసరి భామ భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ.. తన అందం, సొగసు చూపి తెలుగు కుర్రాళ్ల క్రాష్ లిస్ట్లో చేరిపోయింది ఈ బ్యూటీ.

దింతో ఈ ముద్దుగుమ్మకి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఒకటి విజయ్ దేవరకొండకి జోడిగా నటించిన కింగ్డమ్ మూవీ షూటింగ్ కంప్లైట్ అయింది. ఇది ఈ ఏడాది జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే దుల్కర్ సల్మాన్ సరసన కాంత అనే పీరియడ్ డ్రామా సినిమా చేస్తుంది ఈ బ్యూటీ. సెల్వమణి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జోన్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.

వీటితో పాటు రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కథానాయికగా నటిస్తుంది భాగ్యశ్రీ. బయోపిక్ అఫ్ ఫ్యాన్ అనే ట్యాగ్లైన్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ దర్శకుడు పి. మహేష్ బాబు.

చేతిలో ఉన్న ఈ మూడు సినిమా కంప్లీట్ అవ్వకముందే ప్రభాస్ సరసన ఓ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది అనే సమాచారమే. ఇది నిజమైతే భాగ్యశ్రీ స్టార్ అయిపోవడం పక్క. చూడాలిక టాలీవుడ్లో ఈమె జర్నీ ఎలా సాగనుందో.




