Allu Arjun: అల్లు అర్జున్ ప్లానింగ్కు మైండ్ బ్లాక్ అవుతుందిగా..!
పుష్ప 2 తర్వాత నెక్ట్స్ ఎలాంటి కమర్షియల్ సినిమా చేసినా.. ఆడియన్స్కి అంత కిక్ ఇవ్వదనే విషయం అల్లు అర్జున్కు కూడా తెలుసు. అందుకే కెరీర్ను ఇకపైనే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారీయన. అట్లీ సినిమా నుంచే తన ప్లాన్ అమలు చేస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాతో దాన్ని పీక్స్కు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇంతకీ బన్నీ ఏం చేస్తున్నారు..?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 28, 2025 | 7:24 PM

అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత.. దాన్ని మించేలా పుష్పతో రికార్డులతో చెడుగుడు ఆడుకున్నారు. పుష్ప ఏమో గానీ.. పార్ట్ 2 మాత్రం ఏకంగా 1800 కోట్లు వసూలు చేసి బన్నీ రేంజ్ని అమాంతం పెంచేసింది.

ఇంత పెద్ద హిట్ వచ్చింది కాబట్టే.. కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు బన్నీ. పుష్ప 2 తర్వాత ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా.. ఆడియన్స్కు అది ఎక్కడం కష్టమే. అందుకే ఈసారి రూట్ మారుస్తున్నారు బన్నీ.

అట్లీతో చేయబోయే సినిమా జోనర్ ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు రాలేదని తెలుస్తుంది. ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్తో యాక్షన్ జోనర్లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. సమ్మర్ తర్వాత రెగ్యులర్ షూట్ మొదలు కానుంది.

అట్లీ సినిమాతో కొత్త జోనర్ ట్రై చేస్తున్న బన్నీ.. త్రివిక్రమ్ కోసం మరో జోనర్లోకి వెళ్లనున్నారు. ఇప్పటి వరకు కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా మైథలాజికల్ సినిమా చేయబోతున్నారు బన్నీ, గురూజీ.

ఈ కాంబో అంటే ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ఈసారి ఇంకాస్త భారీగా ప్లాన్ చేస్తున్నారు ఈ కాంబో. అట్లీ సినిమా బడ్జెట్ 500 కోట్లకు పైనే ఉండబోతుంది. విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఇక త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అయితే మైథలాజికల్ జోనర్లో నెవర్ బిఫోర్ అన్నట్లు ఉండబోతుంది. తను చేయబోయే నెక్ట్స్ రెండు సినిమాలు డిఫెరెంట్ జోనర్స్ ట్రై చేస్తూ.. కమర్షియల్గానూ సక్సెస్ అయ్యేలా డిజైన్ చేసుకుంటున్నారు అల్లు వారబ్బాయి.





























