Allu Arjun: పురాణాలతో ముడిపడ్డ సోషల్ డ్రామా..బన్నీ రెడీయేనా ??
రిలీజ్కి ఇంకో ఐదు నెలలదాకా గడువున్నప్పటికీ, పుష్ప2 మీద ప్యాన్ ఇండియా రేంజ్లో అంచనాలు మాత్రం భీభత్సంగా కనిపిస్తున్నాయి. వెయ్యి కోట్లను టచ్ చేయడం పెద్ద టాస్కేం కాదు... కొట్టాల్సిన రికార్డులు చాలా ఉన్నాయి అనే భరోసా వినిపిస్తోంది. ట్రేడ్ వర్గాల మాటలు ఇలా ఉంటే, ఫ్యాన్స్ మాత్రం నెక్స్ట్ ఏంటి? అంటూ ఏమైనా లీక్ అందుతుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ నెక్స్ట్ ఏంటి? పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెండు, మూడు యూనిట్లతో స్పీడుగా షూటింగ్ చేస్తున్నారు.
Updated on: Jul 18, 2024 | 7:38 PM

రిలీజ్కి ఇంకో ఐదు నెలలదాకా గడువున్నప్పటికీ, పుష్ప2 మీద ప్యాన్ ఇండియా రేంజ్లో అంచనాలు మాత్రం భీభత్సంగా కనిపిస్తున్నాయి. వెయ్యి కోట్లను టచ్ చేయడం పెద్ద టాస్కేం కాదు... కొట్టాల్సిన రికార్డులు చాలా ఉన్నాయి అనే భరోసా వినిపిస్తోంది. ట్రేడ్ వర్గాల మాటలు ఇలా ఉంటే, ఫ్యాన్స్ మాత్రం నెక్స్ట్ ఏంటి? అంటూ ఏమైనా లీక్ అందుతుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ నెక్స్ట్ ఏంటి?

పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెండు, మూడు యూనిట్లతో స్పీడుగా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమిస్తూనే, నెక్స్ట్ సినిమా గురించి కూడా బాగానే వర్కవుట్ చేస్తున్నారు అల్లు అర్జున్. మరి పుష్ప 2 తర్వాత వచ్చే సినిమా అంటే ఆషామాషీ కాదు కదా.. ఈ సినిమా స్టామినాను దృష్టిలో పెట్టుకుని, ఇందుకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలి కదా... అందుకే ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు బన్నీ.

ఆల్రెడీ త్రివిక్రమ్ డైరక్షన్లో బన్నీ హీరోగా ఓ సినిమా విడుదలైంది. గురూజీ ఫ్రేమ్లో బన్నీని మరోసారి చూడబోతున్నామన్న ఎగ్జయిట్మెంట్ ఆల్రెడీ ఆల్లు ఆర్మీలో మామూలుగా లేదు. సోషల్ డ్రామాకి మైథలాజికల్ టచ్ ఇస్తూ సరికొత్త కథను సిద్ధం చేశారట త్రివిక్రమ్. ప్రీ ప్రొడక్షన్కే చాలా టైమ్ పట్టే సబ్జెక్టు కావడంతో, గుంటూరు కారం తర్వాత ఆ పని మీదే ఉన్నారట గురూజీ. అల వైకుంఠపురం సక్సెస్ వైబ్స్ ఇంకా గుర్తుకొస్తున్నాయి... దాన్ని మించి ఉండాలి ఈ సారి అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.

అలాంటిది పుష్ప2 తర్వాత బండి ఇక ఆగుతుందా చెప్పండి.. రయ్యి రయ్యి మంటూ టాప్ గేర్లో స్పీడందుకోదూ... ఆ స్పీడ్ని అందుకోవడానికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి దాదాపు ఏడాదిన్నర టైమ్ కావాలని అడిగారట త్రివిక్రమ్.

ఇప్పుడు పుష్ప2 బిజినెస్ గురించి స్పెషల్ గాచెప్పాల్సిన పనిలేదు. వెయ్యికోట్ల మార్కు సునాయాసంగా దాటేస్తారంటూ పొరుగువారే హ్యాపీగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు.




