Rajeev Rayala |
Updated on: May 29, 2023 | 12:49 PM
భానుమతి సింగిల్ పీస్ అంటూ తెలుగు కుర్రాళ్ళ మనసులు దోచేసింది అందాల ముద్దుగమ్మ సాయి పల్లవి. నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెస్ మైరైజ్ చేసింది ఈ బ్యూటీ. ఎలాంటి పాత్రలైనా ఇట్టే చేసేసి ప్రేక్షకుల చేత శబాష్ ,అనిపించుకుంది ఈ భామ.
సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ అమ్మడు కోసమే సినిమాకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటు తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అందాల సాయి పల్లవి.
తెలుగులో యాంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది సాయి పల్లవి. మొన్న మధ్య ఈ చిన్నది రానా నటించిన విరాట పర్వం అనే సినిమాలో కనిపించింది. ఆతర్వాత గార్గి అనే డబ్బింగ్ సినిమాలో నటించింది.
గార్గి సినిమా తర్వాత సాయి పల్లవి నుంచి మరో సినిమా రాలేదు. కనీసం నెక్స్ట్ సినిమా అప్డేట్ కూడా లేదు. ఒక్క తెలుగులోనే కాదు, తమిళ్ , మలయాళ భాషల్లోనూ ఈ అమ్మడి నెక్స్ట్ సినిమాలు అనౌన్స్ కాలేదు దాంతో ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.
దీనికి తోడు ఆ మధ్య సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై చెప్తున్నారంటూ పుకార్లు పుట్టుకు రావడంతో ఈ లేడీ పవర్ స్టార్ ఫ్యాన్ మరింత దిగులు పెట్టుకున్నారు.
సోషల్ మీడియా వేదికగా సాయి పల్లవి సినిమా చేయాలని పోస్ట్ లు పెడుతూ హంగామా చేస్తున్నారు. హై బ్రీడ్ పిల్ల ఎక్కడున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమా తరువాత సాయిపల్లవి ఏడాది పాటు ఖాళీగానే ఉంది. అయితే సినిమాల్లో గ్యాప్ రాలేదని.. తానే తీసుకున్నానని ఆమె పేర్కొంది.