AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. వాహనదారులకు ఊరట..

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్ఫష్టతిచ్చింది. ప్రస్తుతానికి పెంచే ప్రతిపాదన లేదని క్లారిటీ ఇచ్చింది. బయట జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధి వద్ద సరుకు రవాణాకు అంతరాయం కలుగుతోంది. దీని వల్ల ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.

Venkatrao Lella
|

Updated on: Apr 28, 2026 | 5:43 PM

Share
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన చేసింది. ధరలను ఇప్పట్లో పెంచేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియనుండటంతో త్వరలో ధరలను పెంచుతారనే ఊహాగానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో కేంద్రం ఈ వార్తలకు చెక్ పెడుతూ మరోసారి ప్రకటన విడుదల చేసింది.

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన చేసింది. ధరలను ఇప్పట్లో పెంచేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియనుండటంతో త్వరలో ధరలను పెంచుతారనే ఊహాగానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో కేంద్రం ఈ వార్తలకు చెక్ పెడుతూ మరోసారి ప్రకటన విడుదల చేసింది.

1 / 5
ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదని సుజాత శర్మ వెల్లడించారు. వినియోగదారులకు ఉపశమనం కల్పించడంపైనే తాము దృష్టి సారించామని, ప్రస్తుతానికి ధరలను పెంచే ప్రణాళికలు లేవని అన్నారు.  హర్ముజ్ జలసంధి దగ్గర ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ముడి సరుకు రవాణాకు అంతరాయం కలుగుతోంది. దీంతో ముడి చమురు ధరలు పెరిగిపోతున్నాయి.

ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదని సుజాత శర్మ వెల్లడించారు. వినియోగదారులకు ఉపశమనం కల్పించడంపైనే తాము దృష్టి సారించామని, ప్రస్తుతానికి ధరలను పెంచే ప్రణాళికలు లేవని అన్నారు. హర్ముజ్ జలసంధి దగ్గర ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ముడి సరుకు రవాణాకు అంతరాయం కలుగుతోంది. దీంతో ముడి చమురు ధరలు పెరిగిపోతున్నాయి.

2 / 5
ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకుంది. హర్ము్జ్ జలసంధి వద్ద నౌకలపై దాడులు పెరుగుతున్న క్రమంలో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం పెంచేది లేదని చెప్పినప్పటికీ.. భవిష్యత్తులో అంతర్జాతీయ పరిణామాలను బట్టి పరిస్థితులు మారొచ్చని అంటున్నారు.

ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకుంది. హర్ము్జ్ జలసంధి వద్ద నౌకలపై దాడులు పెరుగుతున్న క్రమంలో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం పెంచేది లేదని చెప్పినప్పటికీ.. భవిష్యత్తులో అంతర్జాతీయ పరిణామాలను బట్టి పరిస్థితులు మారొచ్చని అంటున్నారు.

3 / 5
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం ప్రారంభమైన దగ్గర నుంచి హర్ముజ్ జలసంధి ద్వారా నౌక రవాణా భారీగా తగ్గింది. యుద్దం కంటే ముందు సుమారు రోజు 138  ఓడలు ప్రయాణించేవి. కానీ ఇప్పుడు 67కి తగ్గిపోయింది. దీంతో అంతర్జాతీయ సరుకు రవాణాపై దీని ప్రభావం పడుతుంది. సముద్ర రవాణాలో గణనీయమైన తగ్గింపును ఇది సూచిస్తోంది. ముడి చమురు సరుకు రవాణాపై ఇది ప్రభావం చూపిస్తుంది.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం ప్రారంభమైన దగ్గర నుంచి హర్ముజ్ జలసంధి ద్వారా నౌక రవాణా భారీగా తగ్గింది. యుద్దం కంటే ముందు సుమారు రోజు 138 ఓడలు ప్రయాణించేవి. కానీ ఇప్పుడు 67కి తగ్గిపోయింది. దీంతో అంతర్జాతీయ సరుకు రవాణాపై దీని ప్రభావం పడుతుంది. సముద్ర రవాణాలో గణనీయమైన తగ్గింపును ఇది సూచిస్తోంది. ముడి చమురు సరుకు రవాణాపై ఇది ప్రభావం చూపిస్తుంది.

4 / 5
ఇక భారత నౌకలు కూడా గత కొద్ది రోజులుగా హర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించడం లేదు. భద్రతా కారణాల వల్ల నౌకలు ఈ మార్గానికి దూరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం భారత నావికులు సురక్షితంగా ఉన్నారు. ఇప్పటివరకు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక విదేశీ నౌకలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాచారం లేదు.

ఇక భారత నౌకలు కూడా గత కొద్ది రోజులుగా హర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించడం లేదు. భద్రతా కారణాల వల్ల నౌకలు ఈ మార్గానికి దూరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం భారత నావికులు సురక్షితంగా ఉన్నారు. ఇప్పటివరకు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక విదేశీ నౌకలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాచారం లేదు.

5 / 5
Follow Us