గుండెపోటు రాకుండా చేసే పండు… వారానికోసారి తింటే చాలు.. రక్తపోటుకు మందు..!
మార్కెట్లో మనకు అనేక రకాల సీజనల్ ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. పండ్లలో మంచి మొత్తంలో పోషకాలు, నీరు సమృద్ధిగా ఉంటుంది. ఈ పండ్లలో పైనాపిల్ ఒకటి. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో క్యాల్షియం, ఫైబర్, విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది అనేక సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది.
Updated on: Jan 21, 2025 | 8:55 PM

కొంతమందికి దంతాల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితిలో అలాంటి వ్యక్తులు పైనాపిల్ తినకూడదు. ఎందుకంటే తీపి, పుల్లని రెండూ ఉండటం వల్ల, ఇది మీ దంతాలలో సున్నితత్వం వంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, పైనాపిల్ ను అధికంగా తీసుకోవడం మానుకోవాలి. రోజుకు కేవలం 200 మిల్లీగ్రాములు మాత్రమే పైనాపిల్ తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటే మాత్రం కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.

పైనాపిల్ ను పరిమితికి మించి తీసుకుంటే ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు సైతం పైనాపిల్ కు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. నోటిపూత సమస్యతో బాధ పడే వాళ్లు సైతం పైనాపిల్ ను తినడం ఆరోగ్యానికి నష్టం చేకూర్చుతుంది. రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలతో బాధ పడేవాళ్లు సైతం పైనాపిల్ ను ఎక్కువగా తీసుకోకూడదు.

పైనాపిల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే అసిడిటీ సమస్యలతో బాధ పడేవాళ్లకు పైనాపిల్ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుంది. అలగే, డయాబెటిక్ రోగులు పైనాపిల్ తినకూడదు. ఎందుకంటే ఇది చాలా తీపిగా ఉంటుంది. దానిలో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ రోగులు పైనాపిల్ తింటే, వారి చక్కెర స్థాయి పెరుగుతుంది. సమస్య పెరిగే అవకాశం ఉంది.

ఫైనాపిల్ లో పొటాషియం, సోడియం మూలకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులకు రాకుండా చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో పైనాపిల్ ఉపయోగపడుతుంది. పచ్చి పైనాపిల్ రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది. పైనాపిల్ రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది.

పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. పైనాపిల్ జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది. ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. పండిన పైనాపిల్ పండును తింటుంటే పళ్ళ నుండి రక్తం కారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.

మరికొంత మందికి పైనాపిల్ తిన్న తర్వాత అలెర్జీ సమస్యలు కూడా వస్తాయి. వారికి ముక్కులో దురద, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఇలాంటివి ఏదైనా సమస్య ఉంటే వెంటనే దాన్ని తినడం మానేయండి. గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తినకుండా ఉండాలి. ఎందుకంటే పైనాపిల్ కోర్ గర్భిణీ స్త్రీలలో రక్తస్రావం కలిగిస్తుంది.





























