మగవారు ధరిస్తే శాపం.. ఆడవారికి అదృష్టాన్ని ఇచ్చిన కోహినూర్.. ఇప్పుడు బ్రిటన్ వారసత్వం సంపదగా ఎలా మారిందో తెలుసా..!

భారత దేశం సంస్కృతి సంప్రదాయాలకు మాత్రమే పుట్టినిల్లు కాదు.. కొన్ని వందల సంవత్సరాల క్రితం అత్యంత ధనికదేశం కూడా.. ఇది తెలుగువారి సంపద . మన దేశంలో పుట్టి ఇప్పుడు పరాయి దేశంలో రాణి కిరీటాన్ని అలంకరించింది. కోహినూర్ ఎక్కడ పుట్టింది.. ఎలా బ్రిటన్ కు చేరుకుంది. ఈ జర్నీ ఏమిటి...

మగవారు ధరిస్తే శాపం.. ఆడవారికి అదృష్టాన్ని ఇచ్చిన కోహినూర్.. ఇప్పుడు బ్రిటన్ వారసత్వం సంపదగా ఎలా మారిందో తెలుసా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 19, 2021 | 5:35 PM

Kohinoor Diamond: భారత దేశం సంస్కృతి సంప్రదాయాలకు మాత్రమే పుట్టినిల్లు కాదు.. కొన్ని వందల సంవత్సరాల క్రితం అత్యంత ధనికదేశం కూడా.. మన దేశ సంపదను మనలోని అనైక్యత విదేశీయుల దాడులకు, ఆక్రమణలకు గురైనట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే వజ్రం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది కోహినూర్ వజ్రం. ఇది మన దేశంలో పుట్టి ఇప్పుడు పరాయి దేశంలో రాణి కిరీటాన్ని అలంకరించింది. మాది మాకు ఇవ్వండి అని గట్టిగా గొంతు ఎత్తి అరిచినా పట్టించుకునేవారే లేరు. ఈ కోహినూర్ వజ్రం దీని కోసం యుద్ధాలు జరిగాయి. ప్రాణాలు పోయాయి. అసలు ఈ కోహినూర్ ఎక్కడ పుట్టింది.. ఎలా బ్రిటన్ కు చేరుకుంది. ఈ జర్నీ ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం..!

కోహినూర్ వజ్రం తెలుగువారి అమూల్య సంపదకు నిలువెత్తు నిదర్శనం. ఈ వజ్రం భారతదేశంలో జరిగిన అనేక చారిత్రక ఘటనలకు ఒక గీటు రాయిగా నిలుస్తుంది. కోహినూర్ అంటే పారశీక భాషలో కాంతి పర్వతం అని అర్ధం. ఇది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలో కొల్లూరుగనుల్లో దొరికింది. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద వజ్రంగా ఖ్యాతిగాంచింది. 105కేరట్లు గల ఈ వజ్రం చరిత్రలోనే పలు వివాదాలకు కారణమైంది.

ప్రస్తుతం విక్టోరియా మహారాణి కిరీటంలో పొదగబడిన వజ్రం హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధానికి దారితీసి చివరికి బ్రిటీష్ వారికి దక్కింది. 1877 లో విక్టోరియా మహారాణి హిందూ దేశ మహారాణిగా పట్టాభిషక్తురాలైనప్పుడు ఆమె కిరీటంలో పొదగబడింది. అయితే ఈ వజ్రాన్ని ధరించిన మగవారు శాపానికి గురవుతారని.. ఆడవారికి మేలు చేకూరుతుందని ఓ నమ్మకం.. మాల్వా రాజు మహలక్ ‌దేవ్‌ దీని ఈ వజ్రం మొదటి యజమాని అని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఆయన చేతిలో క్రీ.శ.1300లో ఈ వజ్రం ఉండేదని, క్రీ.శ.1305లో వింధ్యకు నర్మదకు మధ్యభాగాన్ని దాదాపు వేయి సంవత్సరాలు పరిపాలించిన మాల్వా పాలకవంశాన్ని తుదకు అల్లాఉద్దీన్ జయించి అక్కడి ధనరాశులన్నిటితో పాటుగా కోహినూరును కూడా స్వాధీనం చేసుకున్నారంటూ చాలామంది చరిత్రకారుల కథనం. అయితే మరో కధనం ప్రకారం ఈ వజ్రం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్‌తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు, కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడని సమాచారం. అలా ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోఢి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబరు చేతిలో ఓటమిపాలై, చివరకు మరణించారు.

ఇబ్రహీం లోఢీ మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమయ్యింది. హుమాయున్‌కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్‌తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్యవస్తువులు దానం చేయాల్సిందిగా సలహాఇచ్చారు.అయినా సరే కోహినూర్ ను దానం చెయ్యడానికి సిద్ధం కాలేదు. అనంతరం బాబర్ ఈ వజ్రాన్ని హుమాయున్‌కి ఇచ్చాడు. హుమాయున్ తనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ వజ్రాన్ని అంత్యంత ప్రాణప్రదంగా చూసుకున్నారు. షేర్షా తిరుగుబాటు వల్ల 1539-40 నవంబరు నెలలో రెండుమార్లు యుద్ధం చేసినా హుమాయున్ అతనిపై ఓటమి పాలయ్యాడు. అనంతరం ఈ వజ్రం అనేక రాజుల వద్దకు చేరుకుకుంది. అలా మాల్వాను జయించిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ కి దక్కింది.

1626వ సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం బాబర్‌ వశమై ‘బాబర్‌ వజ్రం’గా పేరు పొందింది. మొఘల్‌ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాడు. మొఘల్‌ చక్రవర్తి మహమ్మద్‌ షా ఎల్లవేళలా వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళా పరిచారిక ద్వారా తెలుసుకున్నాడు. మహమ్మద్‌ షాను తెలివిగా విందుకు ఆహ్వానించిన నాదిర్ షా తలపాగాలు ఇచ్చిపుచ్చుకుందామని ప్రతిపాదన పెట్టి.. ఆ వజ్రాన్ని దక్కించుకున్నాడు. నాదిర్‌షా దాన్ని చూడగానే కోహ్‌ – ఇ- నూర్‌ .. కాంతి శిఖరం అని అభివర్ణించాడు. అప్పటి నుంచి దానికి ఆ పేరే స్థిరపడిపోయింది. క్రీ. శ. 1913 వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్‌ రాజుల నుంచి పంజాబ్‌పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌దీన్ని సొంతం చేసుకున్నాడు. చివరికి చిన్నవయసులో పట్టాభిషిక్తుడైన దులీప్‌సింగ్‌ ద్వారా బ్రిటిష్‌ గవర్నర్‌ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు.

రాణి దానికి మళ్లీ సాన బెట్టించింది. అప్పుడు ఈ వజ్రం నూటా ఎనభై ఆరు క్యారెట్ల నుంచి నూటా తొమ్మిది క్యారెట్లకు తగ్గింది. దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది. తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్‌ రాణులు దీన్ని ధరించారు. దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారు. ఈ కారణంగా కోహినూర్‌ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది.

ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా 1947, 1953వ సంవత్సరంలలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. బ్రిటిష్‌రాణి కిరీటంలో రెండువేల ఎనిమిదివందల వజ్రాల మధ్య రారాజులా వెలిగిపోతున్న కోహినూర్‌ వజ్రాన్ని, సుల్తాన్‌గంజ్‌ బుద్ధ విగ్రహాన్ని ఇవ్వాలంటూ భారత్‌ చేసిన ప్రతిపాదనను బ్రిటన్‌ తోసిపుచ్చింది. బ్రిటిష్‌ రాజకుటుంబం కోహినూరు వజ్రాన్ని ఆ ఇంటి పెద్దకోడలికి వారసత్వ కానుకగా ఇస్తోంది. మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ కోహినూర్‌ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ “ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్‌ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది’ అన్నాడు మనం బహుమతిగా ఇస్తే తిరిగి అడగకూడదు.. కానీ బలవంతంగా తీసుకున్నారు కనుక మన వజ్రం మాకు ఇవ్వమని అడిగే వారు కూడా ఉన్నారు.  అంతటి విశిష్టతను సొతం చేసుకున్న ఈ వజ్రాన్ని ఎప్పటికైనా మన పాలకులు తిరిగి తీసుకొస్తారేమో చూడాలి మరి.

Also Read: నల్ల పసుపు కొమ్ముల విశిష్టత ఏమిటో తెలుసా?.. వీటిని ఎప్పుడైనా చూశారా?..

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!