Viral Video: లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఊహించని సీన్.. భయంతో పరుగులు తీసిన జనాలు! వీడియో వైరల్

లక్నోలోని గోమతీనగర్‌లోని వికల్ప్ ఖండ్-4లో ఉన్న వీవీఐపీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో మంగళవారం ఉదయం కలకలం రేగింది. కాంప్లెక్స్‌ రెండో అంతస్తులోని ఫ్లాట్‌లోకి మొసలి ఆకారంలో ఉన్న ఓ వింత జీవి ప్రవేశించింది. చూసేందుకు అచ్చం మొసలి మాదిరి భారీ పరిమాణంలో ఉంది. అది ఓ మహిళ గదిలోకి ప్రవేశించడంతో ఆమె కెవ్వు.. కెవ్వు.. మంటూ గావు కేకలు..

Viral Video: లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఊహించని సీన్.. భయంతో పరుగులు తీసిన జనాలు! వీడియో వైరల్
Apartment Complex
Follow us

|

Updated on: May 28, 2024 | 5:10 PM

లక్నో, మే 28: లక్నోలోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులోకి మొసలి రావడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే కొంతసేపటి తర్వాత అది మొసలి కాదని, ఇది ఇంకేందో జీవని తెలిసి.. అపార్ట్‌మెంట్‌ వాసులంతా హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలింతకీ ఏం జరిగిందంటే..

లక్నోలోని గోమతీనగర్‌లోని వికల్ప్ ఖండ్-4లో ఉన్న వీవీఐపీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో మంగళవారం ఉదయం కలకలం రేగింది. కాంప్లెక్స్‌ రెండో అంతస్తులోని ఫ్లాట్‌లోకి మొసలి ఆకారంలో ఉన్న ఓ వింత జీవి ప్రవేశించింది. చూసేందుకు అచ్చం మొసలి మాదిరి భారీ పరిమాణంలో ఉంది. అది ఓ మహిళ గదిలోకి ప్రవేశించడంతో ఆమె కెవ్వు.. కెవ్వు.. మంటూ గావు కేకలు వేసింది. దీంతో అపార్ట్‌మెంట్‌లోని వారంతా అటుగా పరుగులు తీశారు. స్థానికులు వెంటనే అటవీశాఖకు సమాచారం అందించి 112కు కాల్ చేసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీశాఖ బృందం గంటపాటు శ్రమించి వింత జీవిని సురక్షితంగా పట్టుకుని గోనె సంచిలో వేసుకుని తమతోపాటు తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Delhi Wire (@delhiwire)

అందిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో గోమతి నగర్‌లోని కథౌటా సరస్సు సమీపంలో ఉన్న ‘యష్ అపార్ట్‌మెంట్’ రెండవ అంతస్తు ఫ్లాట్‌లోని మెట్ల పైభాగంలో వింత జీవి నిద్రిస్తూ కనిపించింది. దీనిని చూసిన అపార్ట్‌మెంట్‌ వాసులు భయంతో కిందకు పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించి అటవీ శాఖ అధికారి అంకిత్ శుక్లా మాట్లాడుతూ.. అది మొసలి కాదని, ఉడుము అనే బల్లి జాతీ ప్రాణి అని అటవీ అధికారులు తెలిపారు. ఇవి సాధారణంగా యాక్టివ్‌గా ఉండవు. వీటి వల్ల మనుషులకు ఎలాంటి హాని ఉండదని అన్నారు. ఉడుములు మనుషులను చూసి భయపడి పారిపోతాయి. ఇది విషపూరితమైనది కాదు. దీనికి భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త