AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బ్రిక్స్ వేదిక నేలపై త్రివర్ణ పతాకాన్ని చూసిన ప్రధాని మోదీ.. వెంటనే ఏం చేశారో చూడండి..

BRICS Summit South Africa: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 15వ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన ఘటన అందిరిలో మరో ఆదర్శాన్ని తట్టి లేపింది. గ్రూప్‌ ఫొటో సందర్భంగా ఈ ఘటన జరిగింది. జాతీయ జెండాను స్టేజ్‌పై.. అంటే కింద చూసిన ప్రధాని మోదీ వెంటనే ఆ త్రివర్ణ పతాకాన్ని తీసుకుని దాచుకున్నారు. ఇది చూసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా తమ దేశం జెండాను కింది నుంచి తీసుకున్నారు. ప్రధాని మోదీ చేసిన గొప్ప పనికి..

Watch Video: బ్రిక్స్ వేదిక నేలపై త్రివర్ణ పతాకాన్ని చూసిన ప్రధాని మోదీ.. వెంటనే ఏం చేశారో చూడండి..
PM Modi Picks Up Tiranga
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 23, 2023 | 8:58 PM

Share

PM Modi Picks Up Tiranga: బ్రిక్స్ సదస్సు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతోంది. కాగా, బుధవారం (ఆగస్టు 23) గ్రూప్‌ ఫొటో సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత త్రివర్ణ పతాకాన్ని నేలపై చూడగానే దానిపై అడుగు పెట్టకుండా చూసుకున్నారు. ప్రధాని త్రివర్ణ పతాకాన్ని తీసుకుని తన వద్ద ఉంచుకున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా తాను కూడా అదే  చేశారు.

ఆ తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌లతో ప్రధాని మోదీ ఫొటోలు దిగారు. బుధవారం జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సెషన్‌లో పాల్గొన్నారు.

బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రసంగించారు

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జోహన్నెస్‌బర్గ్ వంటి అందమైన నగరానికి మరోసారి రావడం తనకు, మా ప్రతినిధి బృందానికి ఆనందంగా ఉందన్నారు. ఈ నగరానికి భారతీయులు, భారతీయ చరిత్రతో లోతైన అనుబంధం ఉందన్నారు. 110 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ నిర్మించిన టాల్‌స్టాయ్ ఫామ్ ఇక్కడికి కొంత దూరంలో ఉందని గుర్తు చేసుకున్నారు.

ఆ వీడియోను ఇక్కడ చూడండి..

భారత్, యురేషియా, ఆఫ్రికా మధ్య ఆలోచనలను కలిపేందుకు ఐక్యత, సామరస్యానికి నేడే మహాత్మ గాందీ బలమైన పునాది వేశారని ప్రధాన మంత్రి అన్నారు. బ్రిక్స్‌ను భవిష్యత్-సన్నద్ధమైన సంస్థగా మార్చడానికి.. మనం మన సంబంధిత సమాజాలను కూడా భవిష్యత్తు-సన్నద్ధం చేయాలి. సాంకేతికత ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. బ్రిక్స్ గ్రూప్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయన్నారు.

ప్రధాని మోదీ ట్వీట్‌లో..

అంతకుముందు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ విషయంలో, అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో జరిగిన వివరాలను ప్రధాని మోదీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. భారత్-దక్షిణాఫ్రికా సంబంధాలను మరింతగా బలోపేతం చేసే లక్ష్యంతో మేము అనేక అంశాలపై చర్చించాం. వాణిజ్యం, రక్షణ, పెట్టుబడి సంబంధాలు మా చర్చలలో ప్రముఖంగా ఉన్నాయి. గ్లోబల్ సౌత్ వాయిస్‌ని బలోపేతం చేయడానికి మేము కలిసి పని చేస్తూనే ఉంటాం.

మరిన్ని జాతీయ వార్తల కోసం

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..