AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బ్రిక్స్ వేదిక నేలపై త్రివర్ణ పతాకాన్ని చూసిన ప్రధాని మోదీ.. వెంటనే ఏం చేశారో చూడండి..

BRICS Summit South Africa: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 15వ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన ఘటన అందిరిలో మరో ఆదర్శాన్ని తట్టి లేపింది. గ్రూప్‌ ఫొటో సందర్భంగా ఈ ఘటన జరిగింది. జాతీయ జెండాను స్టేజ్‌పై.. అంటే కింద చూసిన ప్రధాని మోదీ వెంటనే ఆ త్రివర్ణ పతాకాన్ని తీసుకుని దాచుకున్నారు. ఇది చూసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా తమ దేశం జెండాను కింది నుంచి తీసుకున్నారు. ప్రధాని మోదీ చేసిన గొప్ప పనికి..

Watch Video: బ్రిక్స్ వేదిక నేలపై త్రివర్ణ పతాకాన్ని చూసిన ప్రధాని మోదీ.. వెంటనే ఏం చేశారో చూడండి..
PM Modi Picks Up Tiranga
Sanjay Kasula
| Edited By: |

Updated on: Aug 23, 2023 | 8:58 PM

Share

PM Modi Picks Up Tiranga: బ్రిక్స్ సదస్సు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతోంది. కాగా, బుధవారం (ఆగస్టు 23) గ్రూప్‌ ఫొటో సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత త్రివర్ణ పతాకాన్ని నేలపై చూడగానే దానిపై అడుగు పెట్టకుండా చూసుకున్నారు. ప్రధాని త్రివర్ణ పతాకాన్ని తీసుకుని తన వద్ద ఉంచుకున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కూడా తాను కూడా అదే  చేశారు.

ఆ తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌లతో ప్రధాని మోదీ ఫొటోలు దిగారు. బుధవారం జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సెషన్‌లో పాల్గొన్నారు.

బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రసంగించారు

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జోహన్నెస్‌బర్గ్ వంటి అందమైన నగరానికి మరోసారి రావడం తనకు, మా ప్రతినిధి బృందానికి ఆనందంగా ఉందన్నారు. ఈ నగరానికి భారతీయులు, భారతీయ చరిత్రతో లోతైన అనుబంధం ఉందన్నారు. 110 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ నిర్మించిన టాల్‌స్టాయ్ ఫామ్ ఇక్కడికి కొంత దూరంలో ఉందని గుర్తు చేసుకున్నారు.

ఆ వీడియోను ఇక్కడ చూడండి..

భారత్, యురేషియా, ఆఫ్రికా మధ్య ఆలోచనలను కలిపేందుకు ఐక్యత, సామరస్యానికి నేడే మహాత్మ గాందీ బలమైన పునాది వేశారని ప్రధాన మంత్రి అన్నారు. బ్రిక్స్‌ను భవిష్యత్-సన్నద్ధమైన సంస్థగా మార్చడానికి.. మనం మన సంబంధిత సమాజాలను కూడా భవిష్యత్తు-సన్నద్ధం చేయాలి. సాంకేతికత ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. బ్రిక్స్ గ్రూప్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయన్నారు.

ప్రధాని మోదీ ట్వీట్‌లో..

అంతకుముందు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ విషయంలో, అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో జరిగిన వివరాలను ప్రధాని మోదీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. భారత్-దక్షిణాఫ్రికా సంబంధాలను మరింతగా బలోపేతం చేసే లక్ష్యంతో మేము అనేక అంశాలపై చర్చించాం. వాణిజ్యం, రక్షణ, పెట్టుబడి సంబంధాలు మా చర్చలలో ప్రముఖంగా ఉన్నాయి. గ్లోబల్ సౌత్ వాయిస్‌ని బలోపేతం చేయడానికి మేము కలిసి పని చేస్తూనే ఉంటాం.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు