AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand: దారుణాతి దారుణం.. ‘పూజ’ డిస్ట్రబ్ చేశారని కుటుంబాన్నే అంతమొందించాడు..

Uttarakhand: పూజ చేస్తుంటే డిస్ట్రబ్ చేశారనే ఆగ్రహంతో ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు కూతుర్లు, తల్లిని కత్తితో పొడిచి చంపాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన..

Uttarakhand: దారుణాతి దారుణం.. ‘పూజ’ డిస్ట్రబ్ చేశారని కుటుంబాన్నే అంతమొందించాడు..
God Prays
Shiva Prajapati
|

Updated on: Aug 30, 2022 | 5:12 PM

Share

Uttarakhand: పూజ చేస్తుంటే డిస్ట్రబ్ చేశారనే ఆగ్రహంతో ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు కూతుర్లు, తల్లిని కత్తితో పొడిచి చంపాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌లోని రాణిపోఖ్రీలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

యూపీలోని బండా ప్రాంతానికి చెందిన మహేష్ కుమార్(47), అతని భార్య నీతూ దేవి(36), తల్లి బీతన్ దేవి(75), కుమార్తెలు అపర్ణ(9), స్వర్ణ(11), అన్నపూర్ణ(13) లతో కలిసి రాణిపోఖ్రీలోని నాగఘేర్ ప్రాంతంలోని తన అన్న ఉమేష్ ఇంట్లో నివాసం ఉంటుంన్నారు. మరో పెద్ద కూతురు కృష్ణ(15) రిషికేశ్‌లోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుతోంది. అయితే, కుమార్ దశాబ్ధ కాలంగా ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ప్రార్థనలు, పూజలు చేస్తూ సమయం గడిపేస్తున్నాడు. కాగా, స్పెయిన్‌లో పని చేస్తున్న కుమార్ సోదరుడు ఉమేష్ వారికి నెలవారీ ఖర్చులకు డబ్బులు పంపేవాడు. ఆ డబ్బులతో వారు జీవించేవారు.

అయితే, సోమవారం ఉదయం మహేష్ కుమార్ ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో భార్య నీతూ దేవి.. టిఫిన్ చేస్తుండగా వంట గ్యాస్ అయిపోయిందని, ఎల్‌పిజి సిలిండర్‌ను మార్చాలని కోరాడు. ఆమె అలా అడగటమే పాపం అయ్యింది. అతని కోపం కట్టలు తెంచుకుంది. నీతు తన పూజను డిస్ట్రబ్ చేసిందని ఫుల్ ఫైర్ అయ్యాడు. నేరుగా వంట గదికి వెళ్లి.. అక్కడ ఉన్న కూరగాయలు కోసే కత్తితో నీతూని పొడిచాడు. ఆ తరువాత అడ్డొచ్చిన ముగ్గురు కూతుళ్లు, తల్లి ని కూడా చంపేశాడు.

ఇవి కూడా చదవండి

అయితే, పొరుగింట్లో నివాసం ఉంటున్న సుబోధ్ జైస్వాల్ వీరి అరుపులు విని సహాయం చేయటానికి పరుగెత్తుకెళ్లాడు. రక్షించండి అంటూ వస్తున్న అరుపులు విని.. తలుపులు తట్టాడు. ఎవరూ తెరవలేదు. దాంతో కిటికీ వైపు నుంచి చూడగా.. ఇంట్లో వారందరినీ మహేష్ కుమార్ కత్తితో పొడిచి చంపడం కనిపించింది. వారిని వదిలిపెట్టాలని వేడుకున్నాడు. అయినప్పటికీ.. అతను వినకుండా కిటికీ తలుపులను మూసివేశాడు. ఈ విషయాన్ని అతను పోలీసులకు తెలుపడంతో.. హుటాహుటిన వారు ఘటనా స్థలికి వచ్చారు. అయితే, ఇంతలోనే జరగకూడని ఘోరం అంతా జరిగిపోయింది. ఇంట్లోని వారందరూ దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో నిందితుడైన మహేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో