AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sambhal: 300 ఏళ్ల నాటి సంభాల్‌ శివాలయం.. 46ఏళ్ళుగా ఎందుకు క్లోజ్ చేశారు? ఎంత స్థలం ఆక్రమణకు గురైందో తెలుసా..!

ప్రస్తుతం అందరి దృష్టి సంభాల్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన శివాలయం మీదనే ఉంది. ఈ ఆలయం 1978లో అల్లర్లు జరిగిన తర్వాత ముసి వేయబండింది. అంతకు ముందు ఈ ప్రాంతంలో 42 హిందూ కుటుంబాలు నివసించేవి. 1978లో అల్లర్లు జరిగిన తర్వాత హిందూ కుటుంబాలు క్రమంగా ఈ ప్రాంతం నుంచి వలస వెళ్ళిపోయాయి. తర్వాత ఆలయాన్ని ఆక్రమించి గుడి పైభాగంలో ఉన్న బాల్కనీలను ఆక్రమణదారులు తొలగించారు. ఆలయ ప్రదక్షిణ మార్గం కూడా ఆక్రమణకు గురైంది.

Sambhal: 300 ఏళ్ల నాటి సంభాల్‌ శివాలయం.. 46ఏళ్ళుగా ఎందుకు క్లోజ్ చేశారు? ఎంత స్థలం ఆక్రమణకు గురైందో తెలుసా..!
Sambhal Ancient Temple
Surya Kala
|

Updated on: Dec 16, 2024 | 6:06 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో 46 ఏళ్లుగా మూతపడిన శివాలయాన్ని అధికారులు తెరిచారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆలయ ఆక్రమణలపై సమాచారం అందుకున్న పరిపాలన బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పుడు ఈ పురాతన ఆలయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆలయంలో శివలింగంతో పాటు హనుమాన్ విగ్రహం కూడా ఉంది. అంతేకాదు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పురాతన బావి కూడా ఉన్నట్లు పరిశోధనకారులు గుర్తించారు. అక్కడ జరిపిన తవ్వకంలో మరో మూడు విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి.

సంభాల్‌లోని ఖగ్గు సరాయ్ ప్రాంతంలోని ఈ ఆలయన్ని కార్తీక శంకర ఆలయంగా గుర్తించారు. అంతేకాదు ఈ ఆలయం సుమారు 300 సంవత్సరాల నాటిదని చెబుతున్నారు. అప్పటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ 82 ఏళ్ల విష్ణు శరణ్ రస్తోగి ఈ ప్రాంతం గతంలో హిందువుల ఆధిపత్యంలో ఉండేదని.. ఈ కార్తీక శంకర ఆలయం హిందువుల విశ్వాసానికి కేంద్రంగా ఉందని చెప్పారు. అయితే 1978 అల్లర్ల తర్వాత హిందూ కుటుంబాలు ఈ ఆలయంలో పూజలు చేయడం మానివేశాయన్నారు.

హిందువులు ఎందుకు వలస వెళ్ళారంటే..

కొన్ని వంటల ఏళ్ల క్రితం పూర్వీకులు ఈ ఆలయాన్ని నిర్మించారని విష్ణు శరణ్ రస్తోగి (82 సంవత్సరాలు) చెప్పారు. ఈ ఆలయానికి దగ్గరలో ఒక రావి చెట్టు ఉంది. ఒక బావి కూడా ఉంది. ప్రజలు ఉదయం, సాయంత్రం ఆలయానికి వచ్చి దర్శనం చేసుకునేవారు. బావి దగ్గర దేవుడిని తలచుకుంటూ కీర్తనలు చేసేవారని చెప్పారు విష్ణు విష్ణు శరణ్. అయితే 1978లో ఈ ప్రాంతలో అల్లర్లు జరిగాయి. అప్పుడు హిందువులు భయంతో ప్రాణాలను అరచేతిట్లో పెట్టుకుని ఈ ప్రాంతం నుంచి పారిపోయారు. చుట్టుపక్కల ముస్లిం జనాభా ఉండడంతో భయంతో ఇక్కడ నుంచి వలస వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

విష్ణు శరణ్ రస్తోగి ఈ ప్రాంతం గురించి ఇంకా అనేక విషయాలను పంచుకున్నారు. ఈ ప్రాంతంలో 40 నుంచి 42 హిందూ కుటుంబాలు నివసిస్తుండేవని.. సమీపంలోనే ముస్లిం కుటుంబాలు నివసిస్తూ ఉండేవారని చెప్పారు. అందరిలో సోదరభావం చాలా ఉండేది. ఆలయంలో అన్ని మత సంప్రదాయాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రాంతంలోని తమ పూర్వీకులకు సంబంధించిన చివరి ఇల్లు 2005లో అమ్మివేసినట్లు తెలిపారు.

ఆలయం చుట్టూ 4 అడుగుల మేర ప్రదక్షిణ మార్గం ఉండేది.

విష్ణు శరణ్ ఈ ఆలయం గురించి ఇంకా అనే విషయాలను పంచుకున్నారు. ఈ ఆలయంలో పూజ చేయడానికి, హారతి ఇవ్వడానికి ఎవరూ మిగిలి లేరు. తమ ఇంటిని కూడా ముస్లిం కుటుంబానికి అమ్మేశామని చెప్పారు. అనంతరం స్థానికులు గుడి పైభాగంలో బాల్కనీలు తీశారు. ఆలయం చుట్టూ 4 అడుగుల ప్రదక్షిణ మార్గం ఉండేది. అయితే గుడి ముందు భాగం మినహా మూడు వైపులా ఆక్రమణకు గురైందని అన్నారు.

గుడి తాళం తమ కుటుంబం వద్దే ఉందని.. ఆ ఆలయ నిర్వహణ తమ కుటుంబానికే చెందింది. అయితే తాము ఆ గుడిని తెరవలేదు, పూజలు చేయలేదు. 40 ఏళ్ల క్రితమే గుడిలో పూజలు చేసేందుకు పూజారిని ఏర్పాటు చేశానని .. అయితే ఆ పూజారికి గుడికి వెళ్లే ధైర్యం చేయలేదు.. ముందు ఆ పుజారీ గుడిలో పూజ చేయడానికి రెండు మూడు రోజులు వెళ్ళాడు.. ఆ తర్వాత ఆ పుజారీ గుడికి వెళ్లి పూజ చేయడనికి నిరాకరించాడని చెప్పారు. ఆక్రమణదారులు బావిని మూసివేశారని, కారు పార్క్ చేసేందుకు దానిపై ర్యాంప్‌ను ఏర్పాటు చేశారని విష్ణు శరణ్ చెప్పారు. గుడి కోసం భూమి తమ కుటుంబం ఇచ్చిందని అన్నారు. ఈ గుడి సుమారు 300 సంవత్సరాల క్రితం నుంచి ఉందని.. కాలక్రమంలో ఈ ప్రాంతంలో హిందువులు తక్కువ అవడంలో ఆలయంలో పూజలు ఆగిపోయాయని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్