Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi-Ayodhya: ఈ నెల 30న అయోధ్యకు ప్రధాని మోడీ.. రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ ఆవిష్కరణ

ఉత్తరప్రదేశ్‌లో పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడిన మొదటి రైల్వే స్టేషన్ అయోధ్య రైల్వే స్టేషన్ కానుంది. కొత్త రైల్వే స్టేషన్ భవనం సామాన్యులతో సహా వికలాంగులకు కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. 'IGBC సర్టిఫైడ్ గ్రీన్ స్టేషన్ భవనం'. ప్రయాణికుల రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టేషన్ ఆవరణలో 12 లిఫ్టులు, 12 ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజా, పూజ అవసరాల కోసం దుకాణాలు, క్లోక్ రూమ్, సిక్ రూమ్, చైల్డ్ కేర్ రూమ్ తదితర ఏర్పాట్లు చేశారు. 

PM Modi-Ayodhya: ఈ నెల 30న అయోధ్యకు ప్రధాని మోడీ.. రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ ఆవిష్కరణ
Pm Modi Visits Ayodya
Follow us
Surya Kala

|

Updated on: Dec 26, 2023 | 9:34 AM

రామయ్య జన్మభూమి అయోధ్యలో బాల రామయ్య కొలువుదీరనున్నాడు. ఈ నేపథ్యంలో అయోధ్యాపురిని అందంగా అలంకరిస్తున్నారు. జనవరి 22 వ తేదీన రామాలయం ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో  ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యకు రానున్నారు. అంతకు ముందే అయోధ్యలో భారీ ఎత్తున మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేస్తున్నారు. అనేక అభివృద్ధి పనులు పూర్తి కానున్నాయి. ఇప్పటికే అయోధ్య విమానాశ్రయం మొదటి దశ పనులు పూర్తయ్యాయి. వాణిజ్య విమాన కార్యకలాపాలు ఇక్కడ ప్రారంభం కానున్నాయి. మరోవైపు అయోధ్యలో ఆధునిక రైల్వే స్టేషన్ సిద్ధమైంది.

ఉత్తరప్రదేశ్‌లో పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడిన మొదటి రైల్వే స్టేషన్ అయోధ్య రైల్వే స్టేషన్ కానుంది. కొత్త స్టేషన్ భవనం 140M x 32.6M రామ పాదముద్రతో మూడు అంతస్తుల భవనం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి ప్రయాణీకులను రక్షించడానికి డ్రాప్-ఆఫ్ జోన్ వద్ద 140 m x 12 m అదనపు ఫ్రంట్ పోర్చ్ కూడా ఏర్పాటు చేశారు.

వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు

కొత్త రైల్వే స్టేషన్ భవనం సామాన్యులతో సహా వికలాంగులకు కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. ‘IGBC సర్టిఫైడ్ గ్రీన్ స్టేషన్ భవనం’. ప్రయాణికుల రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టేషన్ ఆవరణలో 12 లిఫ్టులు, 12 ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజా, పూజ అవసరాల కోసం దుకాణాలు, క్లోక్ రూమ్, సిక్ రూమ్, చైల్డ్ కేర్ రూమ్ తదితర ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

మూడు అంతస్తుల స్టేషన్‌

అయోధ్య రైల్వే స్టేషన్‌లో సహజ లైటింగ్‌ను అందించేలా స్కైలైట్‌లతో కూడిన ట్రిపుల్ – హైట్ అట్రియంలను ఏర్పాటు చేశారు. దీనితో పాటు గ్రౌండ్ ప్లోర్, ఫస్ట్ ప్లోర్ లో ప్రయాణీకుల కోసం వెయిటింగ్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు. 28 పడకల రిటైరింగ్ రూమ్‌లు, 32 పడకలతో స్త్రీల కోసం, 44 పడకలతో  పురుషుల కోసం రూమ్స్ తో పాటు అనేక సదుపాయాలను ప్రయాణికులు బస చేసేందుకు కేటాయించారు. సుమారు 60 వేల మంది ప్రయాణికుల రాకపోకలకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రోజుల్లో లక్ష మంది కూడా ఈ రైల్వే స్టేషన్ లో రాకపోకలు చేసే విధంగా సౌకర్యాలను కల్పించారు.

శ్రీ రామ విమానాశ్రయం అయోధ్య

శ్రీ రామ విమానాశ్రయం మొదటి దశ సముద్ర మట్టానికి 335 అడుగుల ఎత్తులో సిద్ధంగా ఉంది. డిసెంబరు 30న ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రజలకు అంకితం చేయనున్నారు. అనంతరం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీనితో పాటు, అయోధ్య నుండి అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, లక్నోలకు కూడా విమానా సర్వీసులు  ప్రారంభం కానున్నాయి.

విమాన రాకపోకలకు సంబంధించి సన్నాహాలు

అయోధ్య విమానాశ్రయం పెద్దదేమీ కాదు. దీంతో రామయ్య ప్రాణ ప్రతిష్ట సమయంలో అంటే జనవరి నెలలో భారీ సంఖ్యలో వీవీఐపీలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అయోధ్య చుట్టుపక్కల ఎయిర్‌బేస్‌లను ఖాళీగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మూలాధారాల ప్రకారం జనవరి 22వ తేదీ లోపు గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్ , లక్నోలో VVIP విమానాలు పార్క్ చేయబడతాయి. అయితే 22వ తేదీ 100 విమానాలు అయోధ్య విమానాశ్రయంలో దిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయోధ్యలో వీవీఐపీలను దించిన ఆ విమానాలను సమీపంలోని విమానాశ్రయాల్లో విమానాన్ని పార్క్ చేయనున్నారు.

డిసెంబర్ 30న ప్రధాని మోడీ అయోధ్యలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. అంతేకాదు మోడీ రోడ్ షో లో  నిర్వహించనున్నారు. దాదాపు 15 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ రోడ్ షో NH-27 హైవే ధరమ్ పాత్, లతా మంగేష్కర్ చౌక్, రామ్ పాత్, తేధి బజార్, మొహబారా కూడలి మీదుగా సాగి అయోధ్య రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..