PM Modi: ప్రధాని ఇంట్లో క్రిస్మస్ వేడుకలు.. స్పందించిన క్రైస్తవ ప్రముఖులు
ఇక క్రిస్మస్ వేడుకను పురస్కరించుకొని ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని క్రిస్టియన్లకు ఆయన గ్రీటింగ్స్ చెప్పారు. వాటికన్ సిటీలోని పోప్ ఫ్రాన్సిస్ తో 2021లో తాను కలిసిన సందర్భాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భం తనకు అత్యంత మరిచిపోలేదనిదిగా పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లు తన నివాసానికి రావడం తనకు...

దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సైతం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. సోమవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో హాజరయ్యారు. ఈ కార్యక్రామానికి పలువురు క్రిస్టియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రధాని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఇక క్రిస్మస్ వేడుకను పురస్కరించుకొని ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని క్రిస్టియన్లకు ఆయన గ్రీటింగ్స్ చెప్పారు. వాటికన్ సిటీలోని పోప్ ఫ్రాన్సిస్ తో 2021లో తాను కలిసిన సందర్భాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భం తనకు అత్యంత మరిచిపోలేదనిదిగా పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లు తన నివాసానికి రావడం తనకు సంతోషాన్ని కలిగించిందని మోదీ చెప్పుకొచ్చారు.
ఇక క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రైస్తవ సంఘం నాయకులను ఉద్దేశిస్తూ ప్రసంగించిన మోదీ.. ఈ పవిత్ర సందర్భంలో ఐక్యత, ఆనందాన్ని పెంపొందించడం కోసం ఇండియన్ మైనారిటీ ఫౌండేషన్ చొరవ చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు క్రైస్తవ నాయకులు కూడా ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’తో మన ప్రధాని ముందుకుసాగుతున్నారని, ప్రపంచ నాయకులచే అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందుతున్నారని ఆర్చ్ బిషప్ అనిల్ క్యూటో చెప్పుకొచ్చారు. సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జాన్ వర్గీస్ మాట్లాడుతూ.. భారతదేశం గెలిస్తే ప్రపంచమే గెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..