AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం ఖర్మ రా బాబూ..! ఏడుగురు పిల్లలను వదిలి.. 22 ఏళ్ల మేనల్లుడితో అత్త జంప్.!

ఉత్తర ప్రదేశ్ రాయ్‌బరేలిలోని మహారాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక షాకింగ్ వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన భర్త, ఏడుగురు పిల్లలను వదిలి తన 22 ఏళ్ల మేనల్లుడితో కలిసి పారిపోయింది. దీంతో భార్య లల్తి, మేనల్లుడు ఉదయరాజ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు భర్త రాజ్‌కుమార్. భర్త తన భార్య లల్తిని ఒప్పించడానికి ప్రయత్నించినప్పుడు, పిల్లలతో ఉన్న అన్ని సంబంధాలను కూడా తెంచుకుంటానని ఆమె తేల్చి చెప్పింది.

ఇదేం ఖర్మ రా బాబూ..! ఏడుగురు పిల్లలను వదిలి..  22 ఏళ్ల మేనల్లుడితో అత్త జంప్.!
Raebareli Crime News
Balaraju Goud
|

Updated on: Aug 26, 2025 | 4:56 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. కామంతో కన్నుమిన్ను కానక, ఓ మహిళ బరితెగించింది. ప్రియుడి మోజులో పడి.. భర్త, పిల్లలను వదిలి పారిపోయింది. రాయ్‌బరేలిలోని మహారాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురే అచ్లి గ్రామంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏడుగురు పిల్లల తల్లి తన 22 ఏళ్ల మేనల్లుడితో పారిపోయింది. బాధిత భర్త పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన భార్యపై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పురే అచ్లి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ పాసి ప్రస్తుతం ఢిల్లీలోని ఒక ఫామ్ హౌస్‌లో తోటమాలిగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. రాజ్‌కుమార్ ఆగస్టు 2న తన భార్య లాల్తిని గ్రామానికి పంపాడు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంటి పైకప్పు వేయడానికి వీలుగా ఆమెకు రూ. 3 లక్షల నగదు కూడా ఇచ్చాడు. ఒక వారం తర్వాత, రాజ్‌కుమార్ గ్రామంలోని తన సోదరులను సంప్రదించి నిర్మాణం గురించి విచారించినప్పుడు, తన భార్య గ్రామానికి రాలేదని, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఏ సామగ్రిని కొనుగోలు చేయలేదని తెలుసుకుని భర్త రాజ్‌కుమర్ షాక్ అయ్యాడు.

రాజ్ కుమార్ తన బంధువులను సంప్రదించినప్పుడు, అతని భార్య లల్తి హైదర్ ఘర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దేవైచా గ్రామంలో నివసిస్తున్నట్లు తెలిసింది. లల్తి దేవి తన ఇంట్లో తన 22 ఏళ్ల మేనల్లుడు ఉదయరాజ్ తో నివసిస్తున్నట్లు గుర్తించారు. భర్త కొంతమంది బంధువులతో దేవైచా గ్రామానికి చేరుకున్నప్పుడు, ఉదయరాజ్ తో కోర్టు ద్వారా వివాహం చేసుకున్నానని, ఇప్పుడు ఆమె అతనితో కలిసి జీవించాలనుకుంటున్నానని భార్య స్పష్టంగా చెప్పింది. భర్త పిల్లల కోసం వేడుకున్నప్పుడు, ఇప్పుడు తనకు పిల్లలతో సంబంధం లేదని భార్య చెప్పి, అందర్నీ షాక్ కి గురిచేసింది.

రాజ్‌కుమార్ చివరకు తన ఏడుగురు పిల్లలతో కొత్వాలి మహారాజ్‌గంజ్‌కు చేరుకుని ఫిర్యాదు చేసి న్యాయం కోసం వేడుకున్నాడు. ఈ విషయంలో, కొత్వాల్ జగదీష్ యాదవ్ మాట్లాడుతూ, ఫిర్యాదు అందిందని, ఈ విషయంపై దర్యాప్తు చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సంఘటన కేవలం కుటుంబ వివాదం కాదు, సామాజిక విలువలు, కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన తీవ్రమైన సమస్య. ఇటువంటి కేసులను కేవలం ప్రేమ వ్యవహారంగా కొట్టిపారేసే బదులు తీవ్రమైన సామాజిక, చట్టపరమైన దృక్పథం నుండి చూడవలసిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..