AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Piyush Jain: పాత స్కూటరుపై తిరిగే పీయూష్ వద్ద రూ. 194 కోట్లా.. నోట్ల కట్టల గుట్టలు చూసిన స్థానికులకు షాక్.. 

జీఎస్టీ సెక్షన్ 69 కింద పీయూష్ జైన్‌ను అరెస్ట్ చేశారు. కాన్పూర్, కన్నౌజ్‌లోని పీయూష్ జైన్ ఇంటిపై దాడి నిర్వహించారు. ఇందులో 250 కోట్లకు పైగా నగదుతోపాటు అనేక కిలోల బంగారం, వెండిని..

Piyush Jain: పాత స్కూటరుపై తిరిగే పీయూష్ వద్ద రూ. 194 కోట్లా.. నోట్ల కట్టల గుట్టలు చూసిన స్థానికులకు షాక్.. 
Piyush Jain
Sanjay Kasula
|

Updated on: Dec 27, 2021 | 6:52 PM

Share

కాన్పూర్‌ వ్యాపారి కటకటాలపాలయ్యారు. అత్తర్‌ బిజిన్‌మెన్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. పన్ను ఎగవేత కేసులో అరెస్టయిన వ్యాపారి పీయూష్‌జైన్‌కు 14 రోజుల కస్టడీ విధించింది కోర్టు. పీయూష్‌ జైన్‌ ఇల్లు, కార్యాలయాల్లో ఇటీవల కేంద్ర ఏజెన్సీలు జరిపిన తనిఖీల్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. పీయూష్ జైన్ కార్యాలయాలపై వరుసగా కొనసాగిన దాడుల్లో 194 కోట్ల విలువైన కరెన్సీ, 23 కిలోల బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో పీయూష్‌ జైన్‌ తదుపరి విచారణ కోసం 14 రోజుల కస్టడీ విధించింది కోర్టు.

జీఎస్టీ సెక్షన్ 69 కింద పీయూష్ జైన్‌ను అరెస్ట్ చేశారు. కాన్పూర్, కన్నౌజ్‌లోని పీయూష్ జైన్ ఇంటిపై దాడి నిర్వహించారు. ఇందులో 194 కోట్లకు పైగా నగదుతోపాటు అనేక కిలోల బంగారం, వెండిని స్వాధీనం చేసుకుంది. డిసెంబరు 22 నుంచి పీయూష్ జైన్ నివాసాలపై దాడులు జరుగుతున్నాయి. పీయూష్ జైన్ తర్వాత ఇతర బడా వ్యాపారవేత్తలపై కూడా దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగించబోతున్నాయి. పీయూష్ జైన్ 40కి పైగా నకిలీ కంపెనీలకు యజమాని అని తెలుస్తోంది. విచారణలో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.

పీయూష్ జైన్ తన ఇంటి వాచ్‌మెన్‌ను ప్రతి ఏడాది మార్చేవాడు. మరో విచిత్రం ఏంటంటే ఇతని ఇంట్లో  పనిమనిషి కూడా లేదు. ఇప్పటి వరకు జరిగిన విచారణ జరుపుతున్న అధికారులకు నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆనందపురి కోఠిలోని తన ఇంటికి కేవలం ఇద్దరు వాచ్‌మెన్‌లను మాత్రమే నియమించకున్నట్లగా తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాచ్‌మెన్‌లను ఎవరు కూడా ఇంట్లోకి వెళ్లకుండా నిషేధించేవారు.

నిత్యం ఓ పాత స్కూటర్‌పైనే తిరిగేవాడని స్థానికులు అంటున్నారు. అతని ఇంటి నుంచి కేవలం రెండు వాహనాలను స్వాదీనం చేసుకున్నారు అధికారులు. అందులో ఒకటి పాత స్కూటర్ కాగా మరొకటి పాత కారు అని తాజా రిపోర్టులో వెల్లడించారు.

అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. రెండు పాత వాహనాలను మాత్రమే నడిపేవాడు. కన్నౌజ్‌లో రిజిస్టర్ అయిన కొడుకు ప్రత్యూష్ పేరుతో 15 ఏళ్ల క్రితం నాటి టయోటా కారును కొనుగోలు చేశాడు.

ఇవి కూడా చదవండి: Teachers Protest: జూనియర్లకు పట్టం కడతారా.. ఆ జీవోను రద్దు చేయాల్సిందే.. రోడ్డెక్కిన ఉపాధ్యాయులు..

Year Ender 2021: మార్కెట్ల దూకుడు.. పెట్రో పరుగు.. భారతీయ యువతలో బిజినెస్ మూడ్.. ఈ ఏడాది ఇవే టాప్!