AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురిని అలా చూసిన తండ్రి.. తట్టుకోలేక ఏం చేశాడంటే..

కూతురు 9వ తరగతి చదువుతోంది.. అంతా బాగానే ఉంది.. ఈ క్రమంలోనే తన కూతురు ఓ యువకుడితో మాట్లాడటాన్ని ఆ తండ్రి చూశాడు.. ఆ తర్వాత దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. తన కుమార్తె ఓ యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయిన తండ్రి..

కూతురిని అలా చూసిన తండ్రి.. తట్టుకోలేక ఏం చేశాడంటే..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Feb 11, 2024 | 8:27 AM

Share

కూతురు 9వ తరగతి చదువుతోంది.. అంతా బాగానే ఉంది.. ఈ క్రమంలోనే తన కూతురు ఓ యువకుడితో మాట్లాడటాన్ని ఆ తండ్రి చూశాడు.. ఆ తర్వాత దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. తన కుమార్తె ఓ యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయిన తండ్రి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించిన అమానవీయ ఘటన అలీఘర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీఘర్‌కు చెందిన ఓ మైనర్‌ బాలిక తన స్నేహతుడితో మాట్లడుతుండగా కుటుంబసభ్యులు చూశారు. ఆ తర్వాత తమ పరువుపోతుందని కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆ తర్వాత ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. బాలికను బయటకు తీసుకెళ్లి.. ఆమె గొంతును మఫ్లర్‌తో నులిమి యమునా నదిలోకి తోసేసి పరారయ్యారు. ఆమె అరుపులు విన్న గ్రామస్థులు, అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు నదిలోకి దూకి కాపాడారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తాను తన స్నేహితుడితో మాట్లాడుతుండగా కుటుంబసభ్యులు పట్టుకున్నారని, ఆ తర్వాత తనకు పెళ్లి చేయాలని నిశ్చయించినట్లు తెలిపింది. అందుకు తాను అంగీకరించకపోవడంతో హత్య చేయడానికి కూడా వెనకాడలేదని శిశు సంక్షేమ అధికారులకు వివరించింది. ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న తండ్రి.. గురుగ్రామ్‌కు తీసుకెళ్తానన్న నెపంతో ఆమెను బైక్‌పై సమీపంలోని గ్రామానికి తీసుకెళ్లాడు. యమునా నదిపై ఉన్న పాంటూన్ వంతెన వద్దకు చేరుకోగానే, అక్కడికి తన మేనమామ వచ్చాడని తెలిపింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మఫ్లర్‌తో ఆమె గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారు. ఆపై వారు ఆమెను నదిలో పడేసి పారిపోయారని ఫతేహాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గిరీష్ కుమార్ తెలిపారు.

ఈ ఘటనపై బాధితురాలు, అలీఘర్‌కు చెందిన 16 ఏళ్ల యువకుడి ఫిర్యాదు మేరకు తండ్రి, మామ ఇద్దరిపై హత్యాయత్నం కేసు నమోదైంది. 9వ తరగతి విద్యార్థిని షెల్టర్‌ హోంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..