Viral: ప్రారంభోత్సవంలో కొబ్బరికాయ కోట్టగానే రోడ్డుకు పగుళ్లు.. షాకైన ఎమ్మెల్యే..
ఇది అలాంటి, ఇలాంటి న్యూస్ కాదు.. టైటిల్ చూసే మీ మైండ్ బ్లాంక్ అయ్యి ఉంటుంది. అవును.. అందులో పొల్లు కూడా కల్పితం లేదు.

ఇది అలాంటి, ఇలాంటి న్యూస్ కాదు.. టైటిల్ చూసే మీ మైండ్ బ్లాంక్ అయ్యి ఉంటుంది. అవును.. అందులో పొల్లు కూడా కల్పితం లేదు. ఉత్తర్ప్రదేశ్ బిజ్నోర్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుచి చౌధరికి ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. కొత్తగా వేసిన రోడ్డుమార్గాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆమె.. కొబ్బరికాయ కొట్టగానే రోడ్డుపై పగుళ్లు వచ్చాయి. దీంతో ఆమెకు తీవ్ర అసహనం కలిగింది. రోడ్డు నాణ్యత ఇదేనా అంటూ అధికారులపై ఫైరయ్యింది. ఖేడా గ్రామంలో రూ. కోటి 16 లక్షలు వెచ్చించి ఏడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మించారు. గురువారం సాయంత్రం శాసనసభ్యురాలు సుచి.. రోడ్డును ప్రారంభించేందుకు వచ్చారు. ఈ క్రమంలో కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు. కొబ్బరికాయ పగలకపోగా.. రోడ్డుపై పగుళ్లు వచ్చాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే భర్త మౌసమ్ చౌధరి రైడా అక్కడే ఉన్నారు. ఆయన ఓ పారతో తవ్వగా.. రోడ్డు ఎంత క్వాలిటీతో వేశారో అర్థమయిపోయింది.
విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎమ్మెల్యే సుచి చౌధరి.. అధికారులపై ఓ రేంజ్లో ఫైర్ అయింది. నాసిరకం రోడ్డు వేసిన కాంట్రక్టర్కు చివాట్లు పెట్టింది. అనంతరం అక్కడే ధర్నాకు దిగి.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో వెంటనే స్పందించిన ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వికాస్ అగర్వాల్ రోడ్డు నమూనాలను సేకరించారు. వీటిని పరిశీలన నిమిత్తం పంపినట్లు వెల్లడించారు.
The MLA says she waited on the spot for 3 hours for a team of officers to arrive and take samples of the road to investigate. She has promised strict action against those responsible for construction of the road at a cost of ₹ 1.16 crore. pic.twitter.com/GiEWeVXEV0
— Subodh Kumar (@kumarsubodh_) December 3, 2021
Also Read: తీవ్ర తుపానుగా ‘జొవాద్’.. ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్షసూచన.. హైఅలెర్ట్..
ఈ ఫోటోలోని టీనేజర్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు.. ఎవరో గుర్తుపట్టారా..?