యూపీలో మూడు జిల్లాలు మినహా అన్ని చోట్ల కోవిద్ కర్ఫ్యూ ఎత్తివేత… సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడి
యూపీలో మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కోవిద్ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. మీరట్, సహరన్ పూర్, గోరఖ్ పూర్ తప్ప మిగిలిన చోట్ల ఈ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నామన్నారు.
యూపీలో మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కోవిద్ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. మీరట్, సహరన్ పూర్, గోరఖ్ పూర్ తప్ప మిగిలిన చోట్ల ఈ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నామన్నారు. ఈ మూడు జిల్లాల్లో కోవిద్ కేసులు 600 కు మించి ఉన్నట్టు ఆయన చెప్పారు. మీరట్ లో 1248, గోరఖ్ పూర్ లో 783, సహరన్ పూర్ లో 1171 కేసులు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బెరైలీ, బులంద్ షహర్ జిల్లాల్లో రేపటి నుంచి కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని ఈవర్గాలు వెల్లడించాయి. కంటెంయిన్మెంట్ జోన్ల బయట షాపులు, మార్కెట్లను వారంలో 5 రోజులు తెరచి ఉంచుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం 75 జిల్లాలకు గాను 67 జిల్లాల్లో ఆంక్షలను సడలించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. వారం రోజుల క్రితం పలు చోట్ల అన్-లాక్ ప్రక్రియను ప్రారంభించామన్నారు.మొదట 20 జిల్లాల్లో కర్ఫ్యూను సడలించిన సంగతి విదితమే. యూపీలో ఇప్పటివరకు 21 వేలమందికి పైగా కోవిద్ రోగులు మరణించారు. అయితే రోజువారీ కేసులు చాలా జిల్లాల్లో తగ్గాయని, మూడు జిల్లాల్లో కూడా తగ్గగలవని ఆశిస్తున్నామని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
అటు-మొత్తం 75 జిల్లాల్లో రెండు రోజుల కర్ఫ్యూను అమలు చేయనున్నారు. కాగా ప్రజలు మాస్కులు ధరించడం లేదని, భౌతిక దూరం పాటించడం లేదని, గుంపులు..గుంపులుగా మార్కెట్లకు వెళ్తున్నారని తమకు సమాచారం అందిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కోవిద్ ని పూర్తిగా అదుపు చేయాలంటే ప్రజలు [ప్రభుత్వానికి సహకరించాలని, ఇప్పటికీ కోవిద్ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు.
మరిన్ని ఇక్కడ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏనుగు వింత చేష్టలు..నీరు త్రాగేందుకు కూడా సోమరితనాన్ని ప్రదర్శిస్తున్న గజరాజు..:Elephant Viral Video