కేంద్ర కీలక నిర్ణయం.. కోల్కతా పోర్ట్ ట్రస్ట్ పేరు మార్పు..
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం కేంద్ర మంత్రి వర్గం జరిపిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్లోని కోల్కతా పోర్ట్ ట్రస్ట్ పేరును మార్చినట్లు కూడా ప్రకటించారు. ఇక నుంచి కోలకతా పోర్ట ట్రస్ట్ పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్గా మార్చినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే ఈ పేరు మార్పు అంశం ప్రధాని మోదీ సమక్షంలోనే ప్రస్తావనకు వచ్చింది. […]
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం కేంద్ర మంత్రి వర్గం జరిపిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్లోని కోల్కతా పోర్ట్ ట్రస్ట్ పేరును మార్చినట్లు కూడా ప్రకటించారు. ఇక నుంచి కోలకతా పోర్ట ట్రస్ట్ పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్గా మార్చినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే ఈ పేరు మార్పు అంశం ప్రధాని మోదీ సమక్షంలోనే ప్రస్తావనకు వచ్చింది. అంతేకాదు.. అప్పడే ఈ పోర్ట్ ట్రస్ట్ పేరును మార్చుతున్నట్లు ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.
Union Cabinet has approved renaming of Kolkata Port Trust as Syama Prasad Mookerjee Trust: Union Minister Prakash Javadekar pic.twitter.com/V5TFP4lqgr
— ANI (@ANI) June 3, 2020