Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రపంచ శాంతికై భారత అణు శక్తి.. ప్రధాన మోడీ నాయకత్వంలోనే..

భారతదేశం-ఫ్రాన్స్ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పారిస్ లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఏఐ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న మోడీ పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. దీని తర్వాత మోడీ అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ (ITER) ప్రాజెక్టును సందర్శించున్నారు.

PM Modi: ప్రపంచ శాంతికై భారత అణు శక్తి.. ప్రధాన మోడీ నాయకత్వంలోనే..
Follow us
Basha Shek

|

Updated on: Feb 11, 2025 | 11:02 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోడీ పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇక ఈ పర్యటనలో కీలకమైన అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ (ITER)ను మోడీ సందర్శించనున్నారు. ఇది క్లీన్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీని సృష్టించే లక్ష్యంతో ఒక ప్రధాన శాస్త్రీయ సహకార ప్రాజెక్ట్. ముఖ్యంగా భారతదేశం ITERలో కీలక భాగస్వామిగా ఉంది. కాగా భారతదేశం నిరంతరం అణు వ్యాప్తి నిరోధక, శాంతియుత అణు సాంకేతిక విస్తరణకు తన వంతు కృషి చేస్తోంది. బాధ్యతాయుతమైన అణుశక్తి సంస్థ (IAEA) భద్రతా చర్యలతో సహా అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంది. అలాగే ప్రపంచ నిరాయుధీకరణ ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తోంది. కాగా వికసిత్ భారత్ మిషన్ లో భాగంగా అణుశక్తి మిషన్ కింద, 2025-26 కేంద్ర బడ్జెట్ లో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల పరిశోధన, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్లు కేటాయించింది. ఈ గణనీయమైన పెట్టుబడి శాంతియుత అణు అనువర్తనాలకు భారతదేశం విస్తృత నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది. సురక్షితమైన, స్థిరమైన అణుశక్తిలో అగ్రగామిగా దాని పాత్రను బలోపేతం చేస్తుంది. 2033 నాటికి కనీసం ఐదు స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన SMRలను రూపొందించడం, అమలు చేయడం దీని ప్రధాన లక్ష్యం. ఇది భారతదేశం లో ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచ ఇంధన భద్రతకు కూడా దోహదపడుతోంది.

అంతకు ముందు AI టెక్నాలజీతో ఉద్యోగాలు పోతాయన్న అపోహను దూరం చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. పారిస్‌ AI యాక్షన్‌ సమ్మిట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. పక్షపాతానికి తావు లేకుండా AI టెక్నాలజీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచదేశాలకు పిలపునిచ్చారు. AI టెక్నాలజీకి మానవత్వాన్ని జోడించారు ప్రధాని మోదీ. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో AI యాక్షన్‌ సమ్మిట్‌ను ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ప్రారంభించారు. AI మిగతా టెక్నాలజీలతో పోలిస్తే భిన్నంగా పనిచేస్తుందన్నారు మోదీ.. ఈ సదస్సుకు సహ అధ్యక్షత వహిస్తున్నారు మోదీ.. ప్రపంచలో టాప్‌ టెక్‌ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. వచ్చే AI యాక్షన్‌ సమ్మిట్‌ను నిర్వహించేందుకు భారత్ సిద్దంగా ఉందన్నారు. AI టెక్నాలజీలతో ప్రపంచం వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు మోదీ. ప్రజల జీవితాలను AI టెక్నాలజీ ఎంతో ప్రభావితం చేస్తోందన్నారు. అయితే AI టెక్నాలజీతో చాలా ఉద్యోగాలు పోతాయన్న భావన ఉందని , ఈవిషయంపై ప్రపంచదేశాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధస్సు AI కారణంగా ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు కోల్పోతారనే ఊహాగానాలు ఉన్నాయని కానీ కొత్త సాంకేతికత కొత్త అవకాశాలను సృష్టిస్తుందనడానికి చరిత్ర సాక్ష్యంగా ఉందన్నారు మోదీ. కొత్త టెక్నాలజీ రాక కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందన్నారు. AI టెక్నాలజీతో వస్తున్న మార్పులపై యువతకు అవగాహన కల్పించి, సవాళ్లను ఎదుర్కొనేలా యువతను సిద్దం చేయాలని మోదీ పిలపునిచ్చారు.