Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar: మీ ఆధార్‌కార్డు జిరాక్స్‌లను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారా? జాగ్రత్త.. కేంద్రం తాజా సూచనలు ఇవే..

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక జిరాక్స్ కాపీలకు బదులు ఆధార్‌కార్డులనే నేరుగా ఫొటోలు తీసి ఎవరెవరికో పంపిస్తున్నాం. ఐతే తాజాగా కేంద్రం ఆధార్‌కార్డు గురించి కీలక సూచనలు జారీ చేసింది..

Aadhaar: మీ ఆధార్‌కార్డు జిరాక్స్‌లను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారా? జాగ్రత్త.. కేంద్రం తాజా సూచనలు ఇవే..
Aadhaar Update
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 31, 2022 | 4:43 PM

నేటి కాలంలో ఎటువంటి సేవలు పొందాలన్నా ఆధార్‌ తప్పనిసరైంది. బ్యాంక్‌ ఖాతా తెరవాలన్నా, మొబైల్‌ సిమ్‌ తీసుకోవాలన్నా, ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్‌ నెంబర్‌ అడుగుతున్నారు. దీంతో చేసేదిలేక జిరాక్స్ సెంటర్లలో కుప్పలుతెప్పలుగా ఆధార్‌కార్డు కాపీలను తీయిస్తున్నాం. ఇక చేతిలో స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక జిరాక్స్ కాపీలకు బదులు ఆధార్‌కార్డులనే నేరుగా ఫొటోలు తీసి ఎవరెవరికో పంపిస్తున్నాం. ఐతే తాజాగా కేంద్రం ఆధార్‌కార్డు గురించి కీలక సూచనలు జారీ చేసింది.

ఆధార్‌కార్డు, వాటి కాపీలను ఎక్కడపడితే అక్కడ వదిలేయొద్దని ప్రజలకు హెచ్చరికలు చేస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. ఇలా చేయడం వల్ల మన విలువైన సమాచారం ఇతరుల చేతిలోకి తేలిగ్గావెళ్లిపోతుందట. దీంతో ఆధార్‌ నెంబర్‌ను సోషల్‌మీడియా, ఇతర బహిరంగ వేదికల్లో ఉంచవద్దని కేంద్రం సూచిస్తోంది. అలాగే ఆధార్‌కు అనుసంధానం చేసిన మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీలను కూడా ఎవరితోనూ పంచుకోవద్దని పేర్కొంది. ప్రతి ఆధార్‌కార్డుదారు తన ఈమెయిల్‌ను ఆధార్‌కు అనుసంధానం చేసుకోవాలని సూచించింది. ఆధార్‌నెంబర్‌ను ఇతరులతో పంచుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెల్పింది. ఇక ఎవరికైనా ఆధార్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తితే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1947ను సంప్రదించాలని, 24 గంటల్లో ఎప్పుడైనా సంప్రదించవచ్చని కేంద్రం సూచనలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.