AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దిగొచ్చిన ట్విట్టర్‌.. 97 శాతం ఖాతాలు, పోస్టులు బ్లాక్‌..? వివరాలు ఇలా ఉన్నాయి..

Twitter: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి పలువురు తప్పుడు సమాచారం

Twitter: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దిగొచ్చిన ట్విట్టర్‌.. 97 శాతం ఖాతాలు, పోస్టులు బ్లాక్‌..? వివరాలు ఇలా ఉన్నాయి..
uppula Raju
|

Updated on: Feb 12, 2021 | 6:34 PM

Share

Twitter: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి పలువురు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, వారి అకౌంట్లను నిలిపివేయాలని కేంద్రం ట్విటర్ ను కోరిన విషయం తెలిసిందే. వాటిలో 97 శాతం ఖాతాలు, పోస్టులను ట్విట్టర్ బ్లాక్‌ చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ స్థానిక చట్టాలను పాటించాలని లేకపోతే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని సంస్థ ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ట్విటర్ కేంద్రం ఆదేశాలను పాటించిందని, 97 శాతం ఖాతాలను, పోస్టులను బ్లాక్‌ చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ వార్తలపై ఇంకా ట్విటర్ స్పందించలేదు.

గతంలో ఐటీ శాఖ ఇండియాలో 1178 అకౌంట్లను రద్దు చేయాలని ట్విటర్‌ను కోరింది. వీటిలో ఖలిస్తానీ సానుభూతిపరులు లేదా పాకిస్థాన్ మద్దతుదారుల అకౌంట్లు ఉన్నాయని, ఇవి దేశ భద్రతకు ముప్పు కలిగించేవని సెక్యూరిటీ సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు కోరింది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛకు తాము ప్రాధాన్యం ఇస్తామంటూ ట్విటర్ వాటిలో కొన్నింటిపైనే చర్య తీసుకుంది. ఆ వ్యవహారంలో కేంద్రం తీవ్ర ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.

గూగుల్‌ను ఆడేసుకున్నారు.. అలా..ఇలా కాదు.. నవ్వులే నవ్వులు.. మీరూ చూడండి..!ట్విట్టర్‌లో పెద్ద ఫన్..