AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగేళ్లుగా రాష్ట్రానికి సేవ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు, రావత్

నాలుగేళ్లుగా రాష్ట్రానికి  సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు.

నాలుగేళ్లుగా రాష్ట్రానికి  సేవ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు, రావత్
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 09, 2021 | 6:38 PM

Share

నాలుగేళ్లుగా రాష్ట్రానికి  సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్ బేబీ రాణి మౌర్యకు  సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ పార్టీ తనకు బంగారం లాంటి ఛాన్స్ ఇచ్చిందని, ఒకచిన్న గ్రామంలో సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు పార్టీ ఎంతో గౌరవం  కూడా ఇఛ్చి సీఎంను చేసిందని అన్నారు. తన విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం ఏకగ్రీవమని, ఇక తను అధికారాన్ని  మరొకరికి అప్పగించాల్సి ఉందని ఆయన చెప్పారు.సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించినందుకు రాష్ట్ర ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన చెప్పారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ రేపు ఉదయం 10 గంటలకు సమావేశమవుతుందని, దీనికి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరవుతారని త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు.

రావత్ రాజీనామాపై స్పందించిన మాజీ సీఎం, కాంగ్రెస్ నేత హరీష్  రావత్..బీజేపీ అధికారంలోకి రాజాలదని ఈ రాజకీయ పరిణామాలు నిరూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుత నాయకత్వం పని చేయజాలదని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా గుర్తించిందని, ఎవరిని ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చోబెట్టినా.. 2022 లో  మళ్ళీ వారు అధికారంలోకి రాజాలరని ఆయన ట్వీట్ చేశారు. ఇలా ఉండగా త్రివేంద్ర సింగ్  సన్నిహితులైన కొందరు నేతలు .. ఆయన రాజీనామాపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావత్ కు 57 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని అంతకు ముందు వీరు  పేర్కొన్నారు.  తమ నేత బలహీన నాయకుడన్న ఆరోపణలను వారు ఖండించారు. కొందరు కావాలనే లేనిపోని ఆరోపణలు చేసి ఈ పరిస్థితిని సృష్టించారని వారు వ్యాఖ్యానించారు. నిజానికి ఉత్తరాఖండ్ లో రాజకీయ పరిస్థితి అంతా బాగానే ఉందని, ఈ నెల 12 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో జరిగే పార్టీ కార్యవర్గ సమావేశాల సన్నాహాలను సమీక్షించేందుకు ఇద్దరు కేంద్ర నేతలు కూడా రాష్ట్రాన్ని సందర్శించారని బీజేపీ ఎంపీ అజయ్ భట్ అన్నారు. పైగా తివేంద్ర సింగ్ రావత్ ప్రభుత్వ నాలుగో యానివర్సరీని కూడా ఆ సందర్భంగా నిర్వహిస్తారని ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు పొలిటికల్ సిచువేషన్ పూర్తిగా మారిపోయింది.

మరిన్ని చదవండి ఇక్కడ :

China: మగవారు లేని మహిళ రాజ్యం గురించి మీకు తెలుసా…!

 

Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు