Free Mobile Data To Students : విద్యార్థులకు ఉచిత 2జీబీ మొబైల్ డాటా.. ఎక్కడో..? ఎందుకో తెలుసా..?
రాష్ట్రంలోని విద్యార్థులందరికీ రోజుకు 2జీబీ మొబైల్ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు...

రాష్ట్రంలోని విద్యార్థులందరికీ రోజుకు 2జీబీ మొబైల్ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. విద్యార్థులు జనవరి 10 నుంచి ఏప్రిల్ మాసాంతం వరకు ఈ ఉచిత మొబైల్ డేటాను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ ప్రకటన ద్వారా రాష్ట్రంలోని 9 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని సీఎం చెప్పారు. కొవిడ్ -19 విస్తరణ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ విద్యాసంస్థలు మూతపడ్డాయి.
కరోనా ప్రభావం ఇప్పటికీ పూర్తిగా తగ్గకపోవడంతో ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు. కాగా, తమిళనాడులో యూజీ, పీజీ విద్యార్థులకు తరగతులు ప్రారంభమైనా.. ఎక్కువ మంది ఆన్లైన్ పాఠాలకే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కాలేజీలతోపాటు స్కాలర్షిప్లతో చదువుకునే ప్రైవేట్ కాలేజీ విద్యార్థులందరికీ ఉచిత మొబైల్ డేటా ఈ సౌలభ్యం అందించనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.



