Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: తమిళనాడులో మళ్ళీ కరోనా కలకలం.. మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. లేదంటే ఫైన్.. నేటినుంచి అమల్లోకి

తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది. దీంతో స్టాలిన్ సర్కార్ ప్రమత్తమైన.. చర్యలు చేపట్టింది. నేటి నుంచి మాస్కులు తప్పని సరి చేసింది. లేదంటే జరిమానా విధించనుంది.

Corona Virus: తమిళనాడులో మళ్ళీ కరోనా కలకలం.. మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. లేదంటే ఫైన్.. నేటినుంచి అమల్లోకి
Tamilanadu Corona Virus
Follow us
Surya Kala

|

Updated on: Jun 27, 2022 | 10:03 AM

Corona Virus: తమిళనాడులో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఈ రాష్ట్రం నుంచి కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రం లోని అన్ని జిల్లాలకు కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.

అంతేకాదు నేటి నుంచి మాస్క్ తప్పనిసరి చేసింది. తప్పని సరిగా కరోనా ఆంక్షలు అమలు చేయాలంటూ పేర్కొంది. కోవిడ్-19 ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండటంలో ప్రజలు అలసత్వం ప్రదర్శిస్తున్నందున రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో  కేసులు పెరుగుతున్నాయని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్-19 నిబంధనలను పాటించని వారి నుంచి తమిళనాడు పబ్లిక్ హెల్త్ యాక్ట్ 1939 ప్రకారం జరిమానాలు వసూలు చేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రజలు మాస్క్ ధరించకపోయినా ..  సామాజిక దూరం పాటించకపోయిన జరిమానా విధించాలని అధికారులకు సూచించింది ప్రభుత్వం. మరోవైపు కరోనా వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలను పెంచాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు సీఎం స్టాలిన్. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించేలా అన్ని జిల్లాలో వైద్య పరీక్షలను పెంచాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ లు కరోనా కేసులపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సీఎం స్టాలిన్ కోరారు.

ఆదివారం రోజున 1,472 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో తమిళనాడులో రోజువారీ కరోనా కేసులు 34,68,344కి  చేరాయి. మరణాల సంఖ్య 38,026గా ఉంది. గత 24 గంటల్లో  కరోనా మరణాలు నమోదు కాలేదని మెడికల్ బులెటిన్ తెలిపింది. గత 24 గంటల్లో 691 మంది వ్యాధి నుండి కోలుకున్నారు. దీంతో  మొత్తం కోలుకున్నవారి సంఖ్య 34,22,860కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా  7,458 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

చెన్నైలో అత్యధికంగా 624 కేసులు నమోదయ్యాయి. అనంతరం చెంగల్‌పేట 241, కోయంబత్తూరు 104 కేసులు నమోదయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..