Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu Rains: తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలు బంద్‌!

ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్ర వ్యాప్తంగాలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజా జీవరణం అస్తవ్యస్తమవుతోంది. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు, తమిళనాడులోని 5 రాష్ట్రాల్లో వ‌ర్షం ముంచెత్తడంతో స్కూల్స్‌, కాలేజీలకు అధికారులు సెల‌వులు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో తమిళనాడులోని కోయంబ‌త్తూరు, నీల్‌గిరిస్‌, దిండిగల్‌, మధురై ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసి వేయవల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు..

Tamil Nadu Rains: తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలు బంద్‌!
Tamil Nadu Rains
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 09, 2023 | 5:05 PM

చెన్నై, నవంబర్‌ 9: ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్ర వ్యాప్తంగాలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజా జీవరణం అస్తవ్యస్తమవుతోంది. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు, తమిళనాడులోని 5 రాష్ట్రాల్లో వ‌ర్షం ముంచెత్తడంతో స్కూల్స్‌, కాలేజీలకు అధికారులు సెల‌వులు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో తమిళనాడులోని కోయంబ‌త్తూరు, నీల్‌గిరిస్‌, దిండిగల్‌, మధురై ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసి వేయవల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు గురువారం (నవంబర్ 9) సెలవులు ప్రకటించారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు నవంబర్‌ 8, 9 తేదీల్లో కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాత క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడుతాయని తెల్పింది.

కోయంబత్తూరు, నీల్జియన్, దిండిగల్ మరియు మదురైలో ఆయా జిల్లాల మేజిస్ట్రేట్‌లు జారీ చేసిన ఆదేశాల మేరకు పాఠశాలలు మూసివేయబడతాయి. ప్రస్తుతం అక్కడ తిరుపూర్, మ‌ధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో కుండ‌పోత వాన కురుస్తోంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠ‌శాలలు, కాలేజీలకు అధికారులు సెల‌వులు ప్రక‌టించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

తమిళనాడులోని నీల్జియన్, కోయంబత్తూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలలో మోస్తరు వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు తిరుప్పూర్ తేని, దిండుగల్, ఈరోడ్, సేలం, నమక్కల్ టెంకన్, శివగంగ మదురై, రామంతపురం, పుదుకోట్టై అరియలూర్, పెరంబలూర్, తిరుచిరాపల్లి కరూర్, తిరువణ్ణామలై, రాణిపేట్, రాణిపేట్, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్ జిల్లాలు, పుదుచ్చేరి, కారైకాల్ తిరువళ్లూరులోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక రాబోయే 24 గంట‌ల్లో త‌మిళ‌నాడు, కేర‌ళ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్లు భార‌త వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.