AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. భార్య, నలుగురు బిడ్డలను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి.. ఆ తర్వాత..

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్య, నలుగురు చిన్నారులను దారుణంగా నరికి చంపాడు. వారందరినీ హత్య తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడు.

దారుణం.. భార్య, నలుగురు బిడ్డలను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి.. ఆ తర్వాత..
Crime
Shaik Madar Saheb
|

Updated on: Dec 13, 2022 | 12:14 PM

Share

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్య, నలుగురు చిన్నారులను దారుణంగా నరికి చంపాడు. వారందరినీ హత్య తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి పరిస్థితి విషమంంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స అందుతుందని అధికారులు తెలిపారు. తిరువణ్ణామలై జిల్లా కలసప్పక్కం పక్కనే ఓరంతవాడి గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పళనిస్వామి – వల్లీ అనే దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు, ఓ అబ్బాయి సంతానం. కొన్ని రోజుల నుంచి పళనిస్వామి – వల్లీ మధ్య వివాదం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలతో భర్త పళనిస్వామి భార్య, నలుగురు పిల్లలను గొడ్డలితో హతమార్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

ఈ క్రమంలో నిన్న రాత్రి ఎప్పటిలాగానే ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా పళనిచ్చామి, వల్లి మధ్య గొడవజరిగింది. ఈ క్రమంలో నిందితుడు ఆవేశంతో భార్య, ముగ్గురు అమ్మాయిలు, అబ్బాయిని గొడ్డలితో హతమార్చాడు. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ చిన్నారి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి