Crime News: హృదయవిదారక ఘటన.. స్విగ్గీ డెలివరీ బాయ్‌ని ఢీకొన్న కారు.. ఆ తర్వాత 500 మీటర్లు లాక్కెళ్లి..

నూతన సంవత్సరంలోకి అడుగిడిన రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. స్విగ్గీ డెలివరీ బాయ్‌ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు..

Crime News: హృదయవిదారక ఘటన.. స్విగ్గీ డెలివరీ బాయ్‌ని ఢీకొన్న కారు.. ఆ తర్వాత 500 మీటర్లు లాక్కెళ్లి..
Swiggy Delivery Boy
Follow us

|

Updated on: Jan 05, 2023 | 5:14 PM

నూతన సంవత్సరంలోకి అడుగిడిన రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. స్విగ్గీ డెలివరీ బాయ్‌ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు 500 మీటర్ల మేర లాక్కెళ్లింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా దేశ రాజధానిలో మహిళను కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన నేపథ్యంలో ఈ సంఘటన వెలుగు చూసింది. వివరాలోకెళ్తే..

స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న కౌశల్ యాదవ్ ఆదివారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. నోయిడాలోని సెక్టార్ 14లో ఫ్లైఓవర్ దగ్గర అతని ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఆ తర్వాత బాధితుడిని అర కిలోమీటరు వరకు కారు ఈడ్చుకెళ్లింది. అనంతరం కారు డ్రైవర్‌ గుడి సమీపంలో కారును వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనలో కౌశల్ యాదవ్ మృతి చెందాడు. అతని మృతదేహం దారుణంగా నలిగిపోయింది. స్థానికులు గమనించి మృతుడి వద్ద ఉన్న ఫోన్‌ ద్వారా అతని సోదరుడికి సమాచారం అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడి ఆచూకీ కోసం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై స్విగ్గీ స్పందిస్తూ.. కౌశల్ యాదవ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. అతని కుటుంబ సభ్యులకు భీమా పరిహారం అందిచడంతోపాటు పోలీసులకు చట్టపరమైన సహాయాన్ని అందిస్తామని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.