Jagannath Temple: పూరి జగన్నాథుడు ఆలయ నిర్మాణాలపై సుప్రీం విచారణ.. తీర్పుని రిజర్వ్‌లో పెట్టిన ధర్మాసనం

ఒడిశాలోని పుణ్యక్షేత్రంలో హెరిటేజ్ కారిడార్ పనులను ఎవరూ ఆపలేరని, భగవంతుడు జగన్నాథుడు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రాజెక్ట్‌లో అక్రమం ఏమీ లేదని పేర్కొన్నారు మిశ్రా.

Jagannath Temple: పూరి జగన్నాథుడు ఆలయ నిర్మాణాలపై సుప్రీం విచారణ.. తీర్పుని రిజర్వ్‌లో పెట్టిన ధర్మాసనం
Jagannath Temple Puri

Updated on: Jun 02, 2022 | 4:05 PM

Jagannath Temple: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ ఆలయం. ఈ ఆలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ  సుప్రీం కోర్టు లో వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ మాట్లాడుతూ ఇది నిషేధిత ప్రాంతమని చెప్పారు. కనుక ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం జరగరాదని చెప్పారు. అంతేకాదు ఈ నిషేధిత ప్రాంతంలో నిర్మాణాలకు ఎటువంటి అనుమతి కూడా తీసుకోలేదని పిటిషనర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆలయ ( జగన్నాథ దేవాలయం పూరీ కేసు ) నిర్మాణానికి సంబంధించి అధికారుల నుంచి ఎలాంటి ఎన్‌ఓసీ తీసుకోలేదని పిటిషనర్ తెలిపారు. ఈ పిటిషన్‌పై తీర్పుని సుప్రీంకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. రేపు మళ్ళీ సుప్రీం ధర్మాసనం విచారణ చేయనుంది.

పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణంతో ఘటనా స్థలంలో భారీ నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొన్నారు. నిర్మాణం ప్రారంభానికి ముందు హెరిటేజ్ సైట్‌పై నిర్మాణం ప్రభావం అంచనా వేయడానికి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వలేదని తనిఖీ సందర్భంగా చెప్పారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వారసత్వ సంపదను మూల్యాంకనం చేయకపోవడంతో ఆలయానికి కోలుకోలేని నష్టం వాటిల్లిందని తెలిపారు. శతాబ్దాల నాటి స్మారక కట్టడాలు కావడంతో వీటి నిర్మాణానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
నిర్మాణం అంటే ఇప్పటికే ఉన్న నిర్మాణాల మరమ్మత్తు లేదా పునర్నిర్మాణం లేదా మురుగు, కాలువలు మొదలైన వాటిని శుభ్రపరచడం కాదని ఒడిశా ఏజీ అన్నారు. డైరెక్టర్ ఆఫ్ కల్చర్ అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. పూరి క్షేత్రాన్ని    సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఒడిశా ఏజీ తెలిపారు. అలాగే ఆలయ భద్రత కోసం కొన్ని పనులు జరుగుతున్నాయి. ప్రపంచ వారసత్వ ప్రదేశంలో మరుగుదొడ్లు నిర్మించలేదా అని ఆయన అడిగారు. అదే సమయంలో ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు.. నిషేధిత ప్రాంతంలో నిర్మాణ పనులు జరగడం లేదని హైకోర్టులో అధికార యంత్రాంగం చెప్పిందని తెలిపింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. ఇప్పుడు ఈ అంశంపై రేపు తీర్పు వెలువరించనుంది.

ఇవి కూడా చదవండి

అంతకుముందు.. ఒడిశాలోని పుణ్యక్షేత్రంలో హెరిటేజ్ కారిడార్ పనులను ఎవరూ ఆపలేరని, భగవంతుడు జగన్నాథుడు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రాజెక్ట్‌లో అక్రమం ఏమీ లేదని పేర్కొన్నారు మిశ్రా. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని అన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్నది జగన్నాథుని కోరిక కూడా. దేవుడు కోరుకున్నట్లుగా నిర్మాణ పనులను ఏ ఏజెన్సీ ఆపలేరన్నారని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..