AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SC On EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకుసుప్రీంకోర్టు ఆమోదం.. కీలక తీర్పు వెల్లడించిన రాజ్యాంగ ధర్మాసనం

ఐదుగురు న్యాయమూర్తులలో ముగ్గురు న్యాయమూర్తులు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్‌ను సమర్థించారు. ఆర్థిక రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి వ్యతిరేకం కాదని జస్టిస్ మహేశ్వరి అన్నారు. 

SC On EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకుసుప్రీంకోర్టు ఆమోదం.. కీలక తీర్పు వెల్లడించిన రాజ్యాంగ ధర్మాసనం
Supreme Court
Sanjay Kasula
|

Updated on: Nov 07, 2022 | 11:09 AM

Share

ఈడబ్యూఎస్ రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. చీఫ్‌ జస్టిస్‌ లలిత్‌, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది సహా నలుగురు రిజర్వేషన్లను సమర్ధించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఈడబ్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరుస్తోంది.. 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. 103వ రాజ్యాంగ సవరణ చేపట్టింది కేంద్రం. అయితే చెల్లుబాటును సవాల్‌ చేస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై ఐదుగురు న్యామూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. గత నెలలో తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీం ధర్మాసనం ఇవాళ తీర్పు వెలవరించింది. 2019 జనవరిలో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్యూఎస్ కోటా కేంద్రం కల్పించింది. సామాజిక వెనుకబాటుతనం కాకుండా ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఈ రిజర్వేషన్లు కల్పించారు. అయితేకులం, మతం, జాతి ఆధారంగా వివక్షకు గురైనవారికి కల్పించాల్సిన స్థానంలో ఆర్థిక వెనుకబాటుతనాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడాన్ని తప్పుపడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి UU లలిత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆర్థికంగా బలహీన వర్గాలకు (EWS) 10 శాతం రిజర్వేషన్ల వ్యవస్థపై తీర్పునిస్తోంది. ఐదుగురు న్యాయమూర్తులలో ముగ్గురు న్యాయమూర్తులు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్‌ను సమర్థించారు. ఆర్థిక రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి వ్యతిరేకం కాదని జస్టిస్ మహేశ్వరి అన్నారు. ఇంకా 103వ సవరణ చెల్లుబాటు అవుతుందన్నారు.

ఈ నిర్ణయాన్ని జస్టిస్ బేలా త్రివేది కూడా అంగీకరించారు. జస్టిస్ మహేశ్వరి తీర్మానంతో నేను ఏకీభవిస్తున్నాను. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు ఇప్పటికే రిజర్వేషన్లు లభించాయని తెలిపారు. దీనిని సాధారణ కేటగిరీలో చేర్చడం సాధ్యం కాదు. రాజ్యాంగ నిర్మాతలు పరిమిత కాలం రిజర్వేషన్లు కొనసాగించాలని మాట్లాడారని అన్నారు. అయితే 75 ఏళ్ల తర్వాత కూడా అది కొనసాగుతోంది. ఇప్పుడు జస్టిస్ జేబీ పార్దివాలా తీర్పును చదివి వినిపించారు.

జస్టిస్ రవీంద్ర భట్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ నిర్ణయాన్ని ఇవ్వడంతో, జస్టిస్ రవీంద్ర భట్ విభేదించారు. అంటే, ఇప్పుడు అది 3-1 నిర్ణయం. ఆయనకు వ్యతిరేకంగా వెళ్లడం కూడా ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేయదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం